Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే వేదికపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు - పక్కపక్కనే నవ్వుకుంటూ...

Webdunia
ఆదివారం, 21 నవంబరు 2021 (14:42 IST)
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం తీవ్రస్థాయిలో వుంది. ఈ అంశం ఇరు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మాడిపోయేలా వుంది. ఇరు రాష్ట్రాలు ఒకరిపై ఒకరు కోర్టులకెక్కుతున్నారు. అలాంటి జలవివాదం ఇరు రాష్ట్రాల మధ్య కాక రేపింది.
 
ఈ వివాదం తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆదివారం ఒకే వేదికపై కనిపించారు. ఒకే సోఫాలో పక్కపక్కనే కూర్చొన్నారు. ముచ్చటించుకున్నారు. నవ్వుకున్నారు. ఈ దృశ్యాలు ఇపుడు మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి మనవరాలి స్నిగ్ధరెడ్డి వివాహ వేడుక ఆదివారం హైదరాబాద్ నగరంలో జరిగింది. పోచారం మనవరాలిని ఏపీ సీఎం జగన్ ఓస్డీ కృష్ణమోహన్ రెడ్డి కుమారుడికిచ్చి వివాహం చేశారు. 
 
దీంతో శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులోని వీఎన్ఆర్ ఫార్మ్స్‌లో ఈ వివాహ ఘట్టం జరిగింది. ఈ వేడుక సాక్షిగా ఇద్దరు ముఖ్యమంత్రులు కలిశారు. ఆ తర్వాత వరుడు రోహిత్ రెడ్డి, వధువు స్నిగ్ధ రెడ్డిలను ఆశీర్వదించారు. గ్రూపు ఫోటో దిగారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments