Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయంత్రం వరకు ఏకాంతంగా గడిపారు.. ఆ తర్వాత చెట్టుకు ఉరేసుకున్న ప్రేమజంట

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (12:47 IST)
తెలంగాణా రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే, వారు చనిపోయేముందు గ్రామ శివార్లలో ఏకాంతంగా గడిపి, ఆ తర్వాత అక్కడే చెట్టుకు ఉరేసుకున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మనగాల మండలం మొద్దుల చెరువు గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చివ్వెం మండలం చందుపట్ల గ్రామానికి చెందిన ఓర్సు నవీన్‌ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తూవచ్చాడు. కొన్నినెలల ప్రేమాయణం తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, వారి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. 
 
దీంతో మనస్తాపానికి గురైన వారు గురువారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మొద్దుల చెరువు గ్రామ శివారులో సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. పిమ్మట ఓ చెట్టుకు ఉరేసుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
 
శుక్రవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు ఈ ప్రేమజంట మృతదేహాలను గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి, దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments