Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకోమని ప్రియుడురాలు ఒత్తిడి.. భార్యకు తెలియడంతో....

Webdunia
ఆదివారం, 18 ఏప్రియల్ 2021 (09:57 IST)
ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి... మరో యువతి ప్రేమలో పడి పీకల్లోతులో కూరుకునిపోయాడు. అదేసమయంలో పెళ్లి చేసుకోవాలంటూ ఆ యువతి ఒత్తిడి చేయసాగింది. పైగా, ఈ విషయం భార్యకూ తెలిసింది. దీంతో ఏం చేయాలో అర్థంకాక... బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని సైదాబాద్‌లో జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. రెయిన్‌ బజార్‌కు చెందిన దీపక్ కుమార్ (18) అనే యువకుడు హయత్‌ నగర్‌కు చెందిన యువతిని గతేడాది ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. హయత్ నగర్‌లో ఉంటున్న అతడు ఇటీవల మరో యువతి ప్రేమలో నిండా మునిగాడు. 
 
ఈ విషయం భార్యకు తెలియడంతో మనస్పర్థలు చెలరేగాయి. మరోవైపు, పెళ్లి చేసుకోవాలంటూ ప్రియురాలి నుంచి ఒత్తిడి పెరగడంతో తట్టుకోలేకపోయాడు. ఈ విషయాన్ని పలుమార్లు స్నేహితులకు చెప్పుకుని మథనపడ్డారు. 
 
ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన దీపక్ కుమార్ తండ్రికి ఫోన్ చేసి ఎర్రకుంట సమీపంలోని పాడుబడిన బావిలో దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు చెప్పాడు. అప్రమత్తమైన తండ్రి కరణ్‌లాల్ వెంటనే 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. 
 
దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అప్పటికే దీపక్ కుమార్ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments