హైదరాబాద్ నగరంలో భారీ అగ్నిప్రమాదం... నలుగురి సజీవదహనం

Webdunia
ఆదివారం, 16 ఏప్రియల్ 2023 (10:54 IST)
హైదరాబాద్ నగరంలోకి కుషాయిగూడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉండే ఓ టింబర్ డిపోలో మంటలు చెలరేగి నలుగురు మంటల్లో సజీవదహనమయ్యారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘోరం జరిగింది. టింబర్ డిపోలో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో పక్క పక్కనే ఉన్న ఇళ్లకు కూడా అంటున్నాయి. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురై రోడ్లమీదకు పరుగులు తీశారు. 
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది, ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పివేశారు. మృతులు వరంగల్ జిల్లాకు చెందిన రమేష్, సుమ, బాబుతో పాటు మరో కార్మికుడిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో నాలుగు షాపులు పూర్తిగా కాలిపోయాయి. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas : ప్రభాస్ పుట్టినరోజున చిత్రం గా పద్మవ్యూహాన్ని జయించిన పార్ధుడు పోస్టర్ రిలీజ్

Shobhita : ప్రేమ, వెలుగు కలిసి ఉండటం అంటే దీపావళే అంటున్న చైతు, శోభిత

Manchu Manoj : గాంధీకి, బ్రిటీష్ వారికి సవాల్ గా మారిన డేవిడ్ రెడ్డి గా మంచు మనోజ్

Samantha Prabhu : అనాథలతో లైట్ ఆఫ్ జాయ్ 2025 దీపావళి జరుపుకున్న సమంత

Atlee: శ్రీలీల, బాబీ డియోల్ కాంబినేషన్ లో అట్లీ - రాణ్వీర్ సింగ్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments