Webdunia - Bharat's app for daily news and videos

Install App

పనిమనిషితో సంసారం చేస్తున్న భర్త.. దీక్షకు దిగిన భార్య.. ఎక్కడ..?

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (22:57 IST)
పనిమనిషితో అక్రమ సంబంధం కారణంగా కట్టుకున్న భార్యను వదిలేశాడు ఓ భర్త. అయితే ఆ భర్త మాత్రం తన భర్త కోసం దీక్షకు దిగింది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని 8వ వార్డు సాయినగర్ కాలనీలో తన భర్తను తనకు వదిలిపెట్టాలంటూ ఒక భార్య దీక్షకు దిగడం చర్చనీయాంశంగా మారింది. 
 
తూర్పాటి బిక్ష్యం దంతలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన రామానుజమ్మకు మూడు దశబ్ధాల క్రితం పెళ్లి అయింది. ఐదుగురు సంతానం ఉన్నారు. సాఫీగా సాగుతున్న సంసారంలో పని మనిషి రూపంలో ఆ కుటుంబంలో కలకలం రేగింది. ఇంట్లోని పనిమనిషితో తన భర్త అక్రమసంబంధం పెట్టుకున్నాడని, ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడని భార్య రామానుజమ్మ ఆరోపిస్తుంది.
 
పనిమనిషిని పెళ్లి చేసుకుని తనను, తన పిల్లలను భర్త పట్టించుకోవడం లేదని చెబుతోంది. తన భర్తను తనకు వదిలేయాలని అడిగితే పనిమనిషి దాడులు చేస్తుందని, పిల్లలను తన వద్దకు రాకుండా తనను ఒంటరి చేశారని భార్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. గతంలో ఈ విషయంపై సఖీ కేంద్రంలో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, అధికారులు తన భర్త తన వద్దకు వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments