Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేధింపులు తాళలేక.. భర్త కళ్లముందే భార్య పురుగుల మందు తాగింది

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (12:09 IST)
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. భర్త వేధింపులు తాళలేక.. ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. భర్త ఎదురుగా ఉండగానే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎం. ఎం. పహాడీలో శుక్రవారం చోటు చేసుకుంది.
 
ఈ ఘటన వివరాల్లోకి వెళితే…. భర్త వేధింపు భరించలేక రాజేంద్ర నగర్‌‌కు చెందిన షభానా బేగమ్ అనే వివాహిత… పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. తను పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంటున్నానని… ఇక నుండి నీవు ప్రశాంతంగా ఉండు అంటూ భర్తతో చెప్పి తన ముందే పురుగుల మందు సేవించింది.
 
భార్య విషం సేవించిందనే విషయం తెలిసి కూడా భార్యను కాపాడాల్సింది పోయి.. మూర్ఖంగా ప్రవర్తించాడు దుర్మార్గుడు సాజీద్. తన ముందే గిల గిలా కొట్టుకుంటున్నా ఆసుపత్రికి తీసుకొని వెళ్లకుండా పైశాచిక ఆనందాన్ని పొందాడు. చివరకు ఆ అభాగ్యురాలు ప్రాణాలు విడిచింది. 
 
ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షభానా మృతితో తన ఐదుగురు పిల్లలు అనాథలు అయ్యారు. కాగా.. రెండు రోజుల కిందటే… నెల్లూరు జిల్లాలోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments