Webdunia - Bharat's app for daily news and videos

Install App

చండీయాగానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానిస్తాం: కేసీఆర్

Webdunia
బుధవారం, 25 నవంబరు 2015 (18:56 IST)
వచ్చేనెల 23న నిర్వహించే చండీయాగానికి ఏపీ  సీఎం చంద్రబాబును ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. సీపీఐ నాయకులు సురవరం సుధాకర్‌ రెడ్డి యాగం ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని చెప్పడం తప్పని కేసీఆర్ వ్యాఖ్యానించారు. 
 
తన సొంత ఖర్చుతోనే ఈ చండీయాగాన్ని నిర్వహిస్తానని.. కొందరు ఔత్సాహికులు కూడా స్పాన్సర్ చేయడానికి ముందుకు వస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ యాగంలో 4,500 మంది బ్రాహ్మణులు, 1500 మంది రుత్వికులు పాల్గొంటారని కేసీఆర్ వెల్లడించారు. తానొక్కడినే ఈ యాగాన్ని డబ్బు వెచ్చించి నిర్వహించడం కుదరదని.. స్పాన్సర్లు కూడా ఇందులో పాల్గొంటారని చెప్పారు. 
 
ఈ యాగానికి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కూడా ఆహ్వానించినట్లు తెలిపారు. డిసెంబర్ 23 నుంచి 27వ తేదీ వరకు ఫామ్ హౌస్ (హైదరాబాద్ శివారు ఎర్రవెల్లి-మెదక్ జిల్లా)లో ఈ చండీయాగం జరుగనుందని కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఈ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.  

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments