తెలంగాణలో వాట్సాప్ ద్వారా ఆన్‌లైన్ పాఠాలు.. సర్కారు గ్రీన్‌సిగ్నల్

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2020 (12:08 IST)
సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం ఆన్‌లైన్ తరగతులు జరుగుతున్నాయి. ముఖ్యంగా వాట్సాప్ ద్వారా ఆన్‌లైన్ తరగతులు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా తెలంగాణా ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలు చెప్పే విధంగా వాట్సాప్‌ను వినియోగించేందుకు శ్రీకారం చుట్టారు.
 
ఇప్పుడు కరోనా కారణంగా చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లోనే పిల్లలకు చదువులు చెప్పేస్తున్నారు.. అదీ వాట్సాప్ ద్వారా. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకే పరిమితమైన వాట్సాప్‌ పర్యవేక్షణ. బుధవారం నుంచి ప్రభుత్వ పాఠశాలలకూ చేరింది. 
 
కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు మూతపడటంతో ఆన్‌లైన్‌ లేదా టీవీల ద్వారా పాఠ్యాంశ బోధనకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ క్రమంలో ఆగస్టు 27 నుంచి విధులకు హాజరవుతున్న టీచర్లు.. తమ తరగతి విద్యార్థుల పర్యవేక్షణకు సామాజిక మాధ్యమాల వాడకాన్ని విస్తృతం చేశారు.
 
ఇందులో భాగంగా వాట్సాప్‌ గ్రూప్‌ ఒకటి క్రియేట్‌ చేసి.. క్లాస్‌ టీచర్‌ అడ్మిన్‌గా ఉంటూ విద్యార్థులను ఆ గ్రూప్‌లో సభ్యులుగా చేరుస్తున్నారు. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలు వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ల ద్వారా బోధన కార్యక్రమాలను సాగిస్తుండగా, తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ వాట్సాప్‌ వాడకం అనివార్యమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saravanan: కుటుంబ పోరాటంలో ఖైదీగా మారిన కథతో శరవణన్ సినిమా లీడర్ టీజర్

Pawan: ముందుగానే పవర్ స్టార్ తుఫాన్- మార్చి 19న థియేటర్లలో 'ఉస్తాద్ భగత్ సింగ్

Balakrishna: తాజా న్యూస్... నందమూరి బాలక్రిష్ణ, మలినేని గోపీచంద్ సినిమా కథ మారిందా ?

మరోమారు ఆపన్న హస్తం అందించేందుకు సిద్ధమైన సోనూసూద్

Pawan kalyan: మార్చి నెల ఉస్తాద్ గబ్బర్ సింగ్‌కు కలిసి వచ్చేలా వుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తర్వాతి కథనం
Show comments