Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాగ్యనగరిలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్, ఏంటది?

Webdunia
శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (11:05 IST)
భాగ్య నగరిలో మందు బాబులకు చెడు వార్త. గణేష్ నిమజ్జనం శోభాయాత్రను పురస్కరించుకుని హైదరాబాద్ నగర వ్యాప్తంగా రెండు రోజుల పాటు మద్యం దుకాణాలను మూసివేశారు. ఈ దుకాణాల మూసివేత రెండు రోజుల పాటు కొనసాగుతుంది. అలాగే, శుక్ర, శనివారాల్లో మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు అనేక ఆంక్షలు విధించారు. 
 
అలాగే, దరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో మద్యం షాపులను మూతపడనున్నాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఈ దుకాణాలను మూసివేయనున్నారు. మద్యంషాపులు, కల్లు దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీచేశారు. 
 
మరోవైపు, గణేష్ నిమజ్జాన్ని పురస్కరించుకుని తెలంగాణాలోని పలు జిల్లాల్లో శుక్రవారం విద్యా సంస్థలకు, ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలోని రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజిగిరి జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ఇవ్వగా, నవంబరు 12వ తేదీన వచ్చే సెలవు దినాన్ని పని దినంగా ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments