Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రోన్ల సాయంతో మందులు ఎగురుకుంటూ వస్తాయ్..!

Webdunia
శనివారం, 20 జులై 2019 (19:49 IST)
ఇకపై మందులు డ్రోన్ల సాయంతో ఎగురుకుంటూ వస్తాయి. ఆరోగ్య సంరక్షణలో డ్రోన్ల అమలుకు రంగం సిద్ధమవుతుంది. రోగులకు అత్యవసర సేవల కోసం డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. తద్వారా వారి ప్రాణాలను కాపాడవచ్చునని తెలంగాణ సర్కారు ఈ పద్ధతిని అమలులోకి తెస్తోంది. 
 
ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ నెట్‌వర్క్ కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సెంటర్ (WEF) తెలంగాణలో మెడిసిన్ ఫ్రమ్ ది స్కై అనే వినూత్న డ్రోన్-డెలివరీ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు తాజాగా ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం, హెల్త్ నెట్ గ్లోబల్ భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ ప్రాజెక్టులో రక్తం, టీకాలు, వైద్య నమూనాలు, అవయవాల శీఘ్రంగా డెలివరీ అవుతాయి. ఇందుకోసం సమగ్ర అధ్యయనం జరుగనుంది. 
 
తెలంగాణ ప్రభుత్వం, వరల్డ్ ఎకనామిక్ ఫోరం మరియు హెల్త్ నెట్ గ్లోబల్ ఈ ప్రాజెక్టుకు కావలసిన సాంకేతికత, పరిశోధనలలో సహాయబడే వారికీ నాయకత్వం వహించే ఒప్పందంపై సంతకం చేశారు. 
 
వైద్య సేవలను మెరుగ్గా అందించేందుకు డెలివరీ కోసం డ్రోన్‌లను ఎలా ఉపయోగించవచ్చునో పరిశీలించనున్నారు. తర్వాత తెలంగాణలో పైలట్ అమలు జరుగుతుంది. డ్రోన్లను ఉపయోగించి వైద్య సామాగ్రిని రవాణా చేయడానికి చారిత్రాత్మక ప్రయత్నం చేస్తున్నట్లు హెల్త్ నెట్ గ్లోబల్ లిమిటెడ్ అధ్యక్షులు కె. హరిప్రసాద్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments