Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంటలకు పరిహారం అందేలా చూస్తాం: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

Webdunia
శనివారం, 24 జులై 2021 (13:15 IST)
వరదల వల్ల నీట మునిగిన పంట పొలాలకు ప్రభుత్వపరంగా స‌హాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ తెలిపారు. భారీ వ‌ర్షాల వ‌ల్ల వ‌ర‌ద నీటిలో మునిగి దెబ్బ‌తిన్న పంట‌ల‌ను మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప‌రిశీలించారు.

శ‌నివారం పీచ‌ర‌, ధ‌ర్మారం, చింతల్ చాంద‌ గ్రామాల్లో వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో పర్య‌టించి, పంట‌ల‌ను, చేప‌ల చెరువును ప‌రిశీలించారు. ఏ మేర‌కు  పంట న‌ష్టం వాటిల్లింద‌ని రైతుల‌ను,  అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. భారీ వ‌ర్షాల‌ వలన వరద ఉధృతితో నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయన్నారు.

వరదల తాకిడి వల్ల పంటలు నీట మునిగి రైతులు నష్టపోయారని, వారికి ప్రభుత్వ పరంగా స‌హాయం అందించేందుకు  రెవెన్యూ శాఖ చర్యలు తీసుకుంటుంద‌ని అన్నారు. వర్షాలు అధికంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments