హైదరాబాద్ నగర వాసులు రెండు రోజులపాటు నీటి కష్టాలు రానున్నాయి. ఇదే అంశంపై భాగ్యనగరి జలమండలి నగర వాసులకు కీలక సూచనలు చేసింది. హైద్రాబాద్ మహా నగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న మంజీరా డ్రికింగ్ వాటర్ సప్లై స్కీం(ఎండబ్యూఎస్ఎస్) ఫేజ్-2లో కలాబ్గుర్ నుంచి పటాన్ చెరువు వరకు 1500 ఎంఎండయాపీఎస్సీ పంపింగ్ మెయిన్లైన్కు వివిధ ప్రాంతాల్లో లీకేజీల నివారణకు మరమ్మత్తులు, కందిగ్రామం వద్ద జంక్షన్ పనులు చేపట్టనుంది.
ఈ కారణంగా భాగ్యనగరంలో పలు చోట్ల వివిధ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగనుంది. ఈ నెల 30వ తేదీ శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 31వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటల వరకు ఈ పనులు కొనసాగనున్నాయి.
ఈ కారణంగా మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే ఏరియాలను పరిశీలిస్తే,
డివిజన్ నెం.32 బొల్లారం ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నగర వాసులు నీటిని పొదుపుగా వాడుకోవాలని, హైదరాబాద్ జలమండలి మంగళవారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.