Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ బిర్యానీ ఆరగించిన యువకుడికి రక్తపు వాంతులు

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (14:16 IST)
తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్‌లోని ఓ రెస్టారెంట్‌లో చికెన్ బిర్యానీ ఆరగించిన ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. ఈ విషాదకర ఘటన వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని చోటుచేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చెన్న‌రావుపేట మండ‌ల ప‌రిధిలోని బోడ తండా వాసి ప్ర‌సాద్(23) అనే యువకుడు అదే ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లి, చికెన్ బిర్యానీ ఆర్డరిచ్చి దాన్ని పుష్టిగా ఆరగించాడు. 
 
అయితే రెస్టారెంట్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే అతనికి వాంతులతో పాటు ర‌క్తం కూడా నోట్లో నుంచి ప‌డ‌డంతో ఈ విష‌యాన్ని గుర్తించిన‌ స్థానికులు పోలీసుల‌కు ఫోన్ చేశారు. పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని వెంట‌నే ప్ర‌సాద్‌ను క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్‌కు తీసుకెళ్ల‌గా అప్ప‌టికే ప్ర‌సాద్ మృతి చెందిన‌ట్లు వైద్యులు వెల్లడించారు. 
 
ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని పోలీసులు చెప్పారు. మున్సిపల్ అధికారులు రెస్టారెంటుకు చేరుకుని అక్క‌డి ఫుడ్ శాంపిల్స్‌ను సేక‌రించి ప‌రిశీలిస్తున్నారు. ప్ర‌సాద్ మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆయ‌న మృతికి గ‌ల కార‌ణాలు పోస్టుమార్టం నివేదిక‌లో వెల్ల‌డ‌య్యే అవ‌కాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments