Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌పై రాములమ్మ ఆగ్రహం, ఏమిటి సంగతి?

Webdunia
బుధవారం, 13 మే 2020 (18:14 IST)
వ్రతం చెడ్డా ఫలం దక్కాలని ఒక పాత సామెత ఉంది. అయితే అలా జరగలేదనే ఇప్పుడు రాములమ్మ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడుతోంది. వివరాలలోకి వెళ్తే... ఒకప్పుడు తెరాసలో ఒక వెలుగు వెలిగి... తాజాగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీకి చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్న విజయశాంతి తాజాగా తన ఫేస్‌బుక్ ఖాతా వేదికగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు. 
 
ఈ మేరకు ఆమె తన పేజీలో... "జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతిరోజూ కరోనా పాజిటివ్‌ల సంఖ్య పెరగడానికి కారణం ఏమిటి? సుమారు 50 రోజులుగా ప్రజలు నిజాయితీగా లాక్‌డౌన్ పాటించారు కదా? పాజిటివ్‌ల పెరుగుదలకు కేవలం వైన్ షాపులే కారణమైతే వాటిని మళ్ళీ మూసివేయండి. సరైన సంఖ్యలో పరీక్షలు ఇప్పటివరకూ చేయకుంటే ఆ నిజం ఒప్పుకోండి. 
 
అన్ని త్యాగాలు చేసిన ప్రజలు అసలు సమస్య అర్థం కాక సతమతమవుతున్నారు. వైన్ షాపులు తెరవడమే ఈ పరిస్థితికి కారణమైతే, అనేక ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే స్థాయిలో పెరుగుదల నమోదై ఉండాలి కదా? ముఖ్యమంత్రి దొరగారు తమ తప్పిదాలను ప్రజల అలవాటు మీదకు నెట్టే ప్రయత్నమేదో చేస్తున్నట్టు కనిపిస్తోంది", అంటూ మండిపడ్డారు. మరి... కేసీఆర్ ఏం సమాధానం ఇవ్వనున్నారో.. వేచి చూద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments