Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో ఎన్ని దారుణాలు చూడాలో : విజయ శాంతి

Webdunia
మంగళవారం, 25 డిశెంబరు 2018 (18:29 IST)
తెలంగాణలో యథా రాజా... తథా ప్రజా అన్న చందంగా ప్రజాస్వామ్య పరిస్థితి ఉందన్నారు విజయశాంతి. సీఎం కేసీఆర్ అరాచకంగా కాంగ్రెస్ తరపున గెలిచిన ఎమ్మెల్సీలను టీఆరెస్‌లో కలుపుకుని చేస్తున్న దౌర్జన్యాన్ని ఆదర్శంగా తీసుకుని కొంతమంది దుండగులు ప్రైవేటు ఆసుపత్రిపై దాష్టీకానికి పాల్పడ్డారనీ విమర్శించారు.
 
శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్న వారిని అడ్డుకున్న పోలీసులపై ఎంత దురుసుగా ప్రవర్తించి, దాడికి పాల్పడ్డారో యావత్ తెలంగాణ జనం గమనించారా అన్నారు. కొత్తగా ఏర్పడిన టీఆరెస్ ప్రభుత్వ హయాంలో ఇటువంటి దారుణాలను ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందోనని తెలంగాణ ప్రజానీకం వణికిపోతున్నారు. 
 
ఉద్యమ సమయంలో కూడా ఎంతో సమయమనంతో వ్యవహరించిన తెలంగాణలో ఇలాంటి అరాచకాలను ఎవరూ సహించరు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు మేలుకుని, ఈ తరహా ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments