Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్​భవన్​లో గవర్నర్​ దంపతుల విజయదశమి పూజలు

Webdunia
బుధవారం, 9 అక్టోబరు 2019 (06:58 IST)
విజయదశమిని పురస్కరించుకుని హైదరాబాద్ రాజ్‌భవన్‌లో గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ దంపతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాజ్​భవన్​లో కుటుంబసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

విజయదశమి వేడుకల్లో గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ కుటుంబసమేతంగా పాల్గొన్నారు. రాజ్​భవన్​లో ఏర్పాటు చేసిన జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పాలపిట్టను దర్శించుకున్నారు. పాలపిట్టను పంజరం నుంచి విడిపించి మురిసిపోయారు.

దసరా ప్రత్యేకతను, జమ్మి చెట్టు, పాలపిట్టను దర్శించుకుకోవటం వంటి అంశాల ప్రాశస్త్యాన్ని అర్చకులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో గవర్నర్​ కుటుంబంతో పాటు... సిబ్బంది కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు.
 
జగన్మాత నామస్మరణతో మారుమోగిన భద్రకాళీ ఆలయం
దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లాలోని శ్రీ భద్రకాళీ ఆలయంలో అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. కాకతీయుల ఆరాధ్య దైవం ఓరుగల్లు శ్రీ భద్రకాళీ ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి.

ఉత్సవాల చివరి రోజు రాజరాజేశ్వరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు. పండుగ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. వాహన పూజల కోసం ఆలయం ఎదుట వాహనాలు బారులు తీరాయి.

ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. వికలాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయంలో ఉచిత అన్నదాన కార్యక్రమం చేపట్టారు. సాయంత్రం అమ్మవారిని భద్రకాళి తటాకంలో తెప్పపై ఊరేగించనున్నారు.
 
జనగామ పోలీస్ స్టేషన్​లో ఆయుధ పూజ
దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని జనగామలోని పోలీస్ స్టేషన్​లో ఆయుధ పూజ నిర్వహించారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని జనగామ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్​లో ఆయుధపూజ నిర్వహించారు.

స్టేషన్​లోని ఆయుధాలతోపాటు పోలీస్ వాహనాలకు అర్చకుల మంత్రోచ్చారణలతో పూజలు చేయించారు. పట్టణ ప్రాంత ప్రజలకు దసరా శుభాకాంక్షలతో పాటు, పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని, శాంతిభద్రతలు కాపాడాలని సీఐ మల్లేష్ ప్రజలకు సూచించారు.
 
విజయదశమి రోజున జాతీయ జెండావిష్కరణ
మహబూబాబాద్​ జిల్లా గార్లలో ఆనవాయితీ ప్రకారం విజయదశమి రోజున మసీదు ముందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మత సామరస్యానికి ప్రతీకగా విజయదశమి రోజున జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే అరుదైన సంఘటన మహబూబాబాద్ జిల్లా గార్లలో జరిగింది.

స్వాతంత్రానంతరం గార్ల జాగీర్దార్​ పాలకులు ప్రతి దసరాకు ముస్లీం జెండాకు హిందూ దేవాలయంలో పూజలు జరిపించి మసీదు ఎదురుగా ఆవిష్కరించేవారు. హైదరాబాద్​ విలీనం తర్వాత అధికారంలో ఉన్న కాంగ్రెస్​ జెండాను ఎగురవేశారు. వామపక్షం నాయకులు అభ్యంతరం తెలిపి, హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం తీర్పుతో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments