Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యాయం చేయకపోతే ఇక్కడే సచ్చిపోతాం సారూ

Webdunia
సోమవారం, 8 జూన్ 2020 (16:10 IST)
న్యాయం చేయకపోతే ఇక్కడే సచ్చిపోతాం సారూ... అంటూ తహసీల్దార్ ఆఫీస్ ముందు బాధితులు ఆవేదన వ్యక్తి చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ వద్ద పేషీ పెండింగ్‌లో 13 ఎకరాల పైచిలుకు భూమికి సంబంధించి తమ ప్రత్యర్థులు నిబంధనలు ఉల్లంఘిస్తుంటే పట్టించుకోవాల్సిన కొత్తూరు రెవిన్యూ శాఖ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, దీనివల్ల తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కొత్తూరు మండలం పెంజర్లకు చెందిన కొంతమంది బాధితులు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల తాసిల్దార్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.
 
మండలంలోని సర్వే నెంబర్ 241, 251, 252లో గల మొత్తం 13 ఎకరాల ఒక గుంట భూమిలో వివాదం నడుస్తోంది. ఈ కారణంగా జాయింట్ కలెక్టర్ వద్ద కేసు పెండింగ్ ఉందని పేర్కొన్నారు. అయినప్పటికీ... తమ ప్రత్యర్థులు అక్రమంగా భూమిలోకి ప్రవేశించి ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి భూమి దున్నుతున్నారని, అదేవిధంగా లాక్ డౌన్ సమయంలో బోరు కూడా వేశారని తెలిపారు.
 
ఈ విషయంలో అధికారులకు ఫిర్యాదు చేయగా సరైన చర్య తీసుకోకపోవడం వల్ల నిబంధనలు బేఖాతరు అవుతున్నాయని కొత్తూరు మండలం పెంజర్ల గ్రామానికి చెందిన షేక్ యూసుఫ్ ఉద్దీన్, షేక్ గౌస్ ఉద్దీన్, షేక్ బురానుద్దీన్, కర్రె మహబూబ్ సాబ్ తదితరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం కొత్తూరు మండల తాసిల్దార్ కార్యాలయం ముందు న్యాయం కోసం ఆందోళన వ్యక్తం చేశారు.
 
రెవిన్యూ శాఖ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని పరిష్కారం అయ్యేంతవరకు ఇరువర్గాలు భూమిలోకి వెళ్లకూడదని ఆదేశించగా దీనిని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తూరు అధికారులు స్పందించకపోతే తాము కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. అధికారులు స్పందించి తమ వివాదాస్పద భూమిలో ఎవరు ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments