Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీహెచ్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్య ఫోన్ ... ఆరోగ్యంపై వాకబు

Webdunia
సోమవారం, 12 జులై 2021 (15:31 IST)
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ గత కొన్ని రోజులుగా హైద‌రాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రిలో చికిత్సపొందుతున్నారు. ఆయనను ఇటీవల టీ పీసీసీ చీఫ్‌గా నియమితులైన రేవంత్ రెడ్డి కూడా వెళ్లి పరామర్శించి వచ్చారు. 
 
ఈ క్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సోమవారం వీహెచ్‌కు ఫోన్ చేసిన‌ ఆయ‌న‌ను పరామర్శించారు. ఆయ‌న‌ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. చికిత్స అందిస్తోన్న‌ వైద్యుల సలహాలను పాటించాల‌ని వీహెచ్‌కు చెప్పారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాలని వెంక‌య్య నాయుడు ఆకాంక్షించారు. 
 
కాగా, వీహెచ్‌ పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రజా సేవలో నిమగ్నం కావాలని అన్నారు. వెంక‌య్య నాయుడి పరామర్శతో తనకు తిరిగి ఉత్సాహం వచ్చిందని వీహెచ్ వ్యాఖ్యానించారు. కాగా, కొంత‌ కాలంగా వీహెచ్‌ కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. గ‌త ఏడాది ఆయ‌నకు క‌రోనా సోక‌గా, ఆ వైర‌స్‌ను జ‌యించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments