Webdunia - Bharat's app for daily news and videos

Install App

టైమ్‌కు రావాలన్న హెచ్ఎం.. భర్తతో చితకబాదించిన లేడీ టీచర్

Webdunia
ఆదివారం, 25 జులై 2021 (11:58 IST)
తెలంగాణాలోని గుంటూరు జిల్లాలో ఓ దారుణం జరిగింది. స్కూల్‌కు కరెస్ట్ టైమ్ రావాలంటూ ఆ పాఠశాలలో పని చేసే లేడీ టీచర్‌ను ప్రధానోపాధ్యాయురాలు ఆదేశించింది. దీంతో ఆగ్రహించిన ఆ లేడీ టీచర్ తన భర్తతో హెచ్ఎంను చితకబాదించింది. నల్గొండ జిల్లా దాచేపల్లిలో ఈ ఘటన జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దాచేపల్లిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో రజనీ అనే ఉపాధ్యాయురాలు సమయపాలన పాటించడం లేదు. పాఠశాలకు కరెక్ట్ సమయానికి రావడం లేదని వాడపల్లి  పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పులగం రాధిక గుర్తించి, జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
 
ఈ విషయం తెలుసుకున్న రజని తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. తనపై ఫిర్యాదు చేసిన రాధికపై కసి తీర్చుకోవాలనుకున్నారు. మల్కాపట్నం ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న తన భర్త శ్రీనివాస రెడ్డికి విషయం చెప్పి రాధికపై దాడి చేయాలని ఉసిగొల్పింది. 
 
దీంతో పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు పాఠశాల ఉపాధ్యాయుడు దీపాల కృష్ణ ప్రసాద్, ప్రధానోపాధ్యాయురాలు రాధిక దంపతులు ఈ నెల 19న వాహనంపై వస్తుండగా మిర్యాలగూడకు చెందిన ఆరుగురు వ్యక్తులు కారులో రామాపురం అడ్డరోడ్డు వద్ద వారిపై దాడి చేశారు.
 
ఆ తర్వాత వారి వద్దనున్న ఐదు సవర్ల బంగారం తీసుకుని పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీనివాసరెడ్డి సహా ఏడుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో శ్రీనివాసరెడ్డి, రజనిలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు నిన్న నల్గొండ జిల్లా విద్యాశాఖాధికారి బిక్షపతి ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

శేఖర్ కమ్ముల ఆణిముత్యాలు తీస్తున్నాడు; జాన్వి తో ఒక సినిమా చేస్తా : చిరంజీవి

Dhanush: దర్శకుడు నిర్మాత మొహాల్లో నవ్వు చూడడం చాలా ఆనందంగా ఉంది : ధనుష్

బ్రెయిన్ ఎన్యోరిజమ్‌ సమస్యతో బాధపడుతున్న సల్మాన్ ఖాన్!! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments