Webdunia - Bharat's app for daily news and videos

Install App

హమ్మయ్య ఇక హైదరాబాదులో రోడ్లు దాటడం ఈజీ!

Webdunia
గురువారం, 24 మార్చి 2022 (10:03 IST)
హైదరాబాద్ నగరంలో రహదారులన్నీ నిత్యం రద్దీగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రోడ్డు దాటేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
రోడ్డు దాటే క్రమంలో కొన్ని సార్లు ప్రమాదాలకూ గురవుతున్నారు. వీరి కష్టాలను గుర్తించిన అధికారులు పలు చోట్లు ఫుట్ఓవర్ బ్రిడ్జీలు నిర్మించారు. ఈ క్రమంలో నగరంలోని చందానగర్‌లో పాదాచారులు ప్రమాదాలకు గురి కాకుండా రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు నిర్మించారు.
 
దీప్తి శ్రీ నగర్ ఎంట్రన్స్ ఎదురుగా జాతీయ రహదారి 65 పై రూ.5.5 కోట్లు, పీజేఆర్ ఎన్ క్లేవ్ వద్ద రూ. 5.2 కోట్ల వ్యయంతో నిర్మించిన వంతెనలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి.
 
ఈ రెండు బ్రిడ్జీలను గురువారం ఉదయం 10 గంటలకు ప్రభుత్వ విప్ శేర్ లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ లు ప్రారంభించనున్నారు. 
 
హైదరాబాద్ నగర వ్యాప్తంగా 4 ప్యాకేజీల ద్వారా రూ. 127.3 కోట్లు వ్యయంతో 21 ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు. శేర్ లింగంపల్లిలో రూ. 39.70 కోట్ల వ్యయంతో 5 వంతెన పనులను ప్రతిపాదించారు. అందులో రెండు పూర్తయ్యాయి. మిగతావి నిర్మాణ దశలో ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments