Webdunia - Bharat's app for daily news and videos

Install App

హమ్మయ్య ఇక హైదరాబాదులో రోడ్లు దాటడం ఈజీ!

Webdunia
గురువారం, 24 మార్చి 2022 (10:03 IST)
హైదరాబాద్ నగరంలో రహదారులన్నీ నిత్యం రద్దీగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రోడ్డు దాటేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
రోడ్డు దాటే క్రమంలో కొన్ని సార్లు ప్రమాదాలకూ గురవుతున్నారు. వీరి కష్టాలను గుర్తించిన అధికారులు పలు చోట్లు ఫుట్ఓవర్ బ్రిడ్జీలు నిర్మించారు. ఈ క్రమంలో నగరంలోని చందానగర్‌లో పాదాచారులు ప్రమాదాలకు గురి కాకుండా రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు నిర్మించారు.
 
దీప్తి శ్రీ నగర్ ఎంట్రన్స్ ఎదురుగా జాతీయ రహదారి 65 పై రూ.5.5 కోట్లు, పీజేఆర్ ఎన్ క్లేవ్ వద్ద రూ. 5.2 కోట్ల వ్యయంతో నిర్మించిన వంతెనలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి.
 
ఈ రెండు బ్రిడ్జీలను గురువారం ఉదయం 10 గంటలకు ప్రభుత్వ విప్ శేర్ లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ లు ప్రారంభించనున్నారు. 
 
హైదరాబాద్ నగర వ్యాప్తంగా 4 ప్యాకేజీల ద్వారా రూ. 127.3 కోట్లు వ్యయంతో 21 ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు. శేర్ లింగంపల్లిలో రూ. 39.70 కోట్ల వ్యయంతో 5 వంతెన పనులను ప్రతిపాదించారు. అందులో రెండు పూర్తయ్యాయి. మిగతావి నిర్మాణ దశలో ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments