Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏబీఎన్ - టీవీ9 ప్రసారాల నిలిపివేత .. సుప్రీంకోర్టులో పిటీషన్!

Webdunia
సోమవారం, 24 నవంబరు 2014 (14:54 IST)
తెలంగాణలో ఏబీఎన్‌, టీవీ-9 ఛానెల్స్ ప్రసారాల నిలిపివేతపై దాఖలైన పిటీషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సోమవారం నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి, టీవీ-9 ప్రసారాలను నిలిపివేస్తూ ఎంఎస్‌వోలు తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించిందంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంలో సోమవారం విచారణ జరిగింది.
 
ఈ కేసుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎంఎస్‌వోలతో పాటు మరో 15 మందికి కోర్టు నోటీసులు జారీ చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, హైదరాబాద్‌ సీపీ, ఎంఎస్‌వో అసోసియేషన్‌కు నోటీసులు అందజేసింది. వీటిపై మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
 
ఏబీఎన్‌ దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీం కోర్టు విచారణకు అంగీకరించింది. మొదటి పిటిషన్‌లో రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారన్న ఏబీఎన్‌ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. ఎంఎస్‌వోలు ప్రైవేటు వ్యక్తులైనా రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలన్న ఏబీఎన్‌ వాదనను కోర్టు అంగీకరించింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments