Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ - కర్నాటక రాష్ట్రాలకు ప్రారంభమైన టీఎస్ఆర్టీసీ

Webdunia
సోమవారం, 21 జూన్ 2021 (09:07 IST)
తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ ఎత్తివేశారు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో సాధారణ జీవనం మెరుగుపడుతున్నది. ఈ  క్రమంలో ప్రజలకు పూర్తిస్థాయిలో ప్రజా రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. 
 
ఇందులో భాగంగా టీఎస్‌ఆర్టీసీ అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను పునరుద్ధరించింది. సోమవారం ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు బస్సు సర్వీసులను ప్రారంభించింది. ఆయా రాష్ట్రాల్లో లాక్డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా బస్సులను నడపనుంది. 
 
ఆంధ్రప్రదేశ్‌కు రోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బస్సులు నడుపనున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. రద్దీకి అనుగుణంగా సర్వీసులు నడపుతామన్నారు. అదేవిధంగా కర్ణాటకకు కూడా ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు బస్సులను నడపనుంది. 
 
బెంగళూరు మినహా కర్ణాటకలోని అన్ని ప్రాంతాలకు సర్వీసులను అందుబాటులో ఉంచుతుంది. కర్ణాటకలో వారాంత కర్ఫ్యూ దృష్ట్యా సర్వీసులను నిలిపివేయనుంది. దీంతో శుక్రవారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు బస్సులను బంద్‌ చేయనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

Bobby Kolli: డైరెక్టర్ బాబీ కొల్లి KVN ప్రొడక్షన్స్‌తో సినిమా ప్రకటన

దేవరకొండ కోసం నల్లగండ్ల అపర్ణా సినిమాస్‌లో రాజమౌళి ప్రత్యక్షం

Raviteja: రవితేజ మాస్ జాతర విడుదల ఆలస్యమవుతుందా?

మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రికార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments