Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ - కర్నాటక రాష్ట్రాలకు ప్రారంభమైన టీఎస్ఆర్టీసీ

Webdunia
సోమవారం, 21 జూన్ 2021 (09:07 IST)
తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ ఎత్తివేశారు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో సాధారణ జీవనం మెరుగుపడుతున్నది. ఈ  క్రమంలో ప్రజలకు పూర్తిస్థాయిలో ప్రజా రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. 
 
ఇందులో భాగంగా టీఎస్‌ఆర్టీసీ అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను పునరుద్ధరించింది. సోమవారం ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు బస్సు సర్వీసులను ప్రారంభించింది. ఆయా రాష్ట్రాల్లో లాక్డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా బస్సులను నడపనుంది. 
 
ఆంధ్రప్రదేశ్‌కు రోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బస్సులు నడుపనున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. రద్దీకి అనుగుణంగా సర్వీసులు నడపుతామన్నారు. అదేవిధంగా కర్ణాటకకు కూడా ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు బస్సులను నడపనుంది. 
 
బెంగళూరు మినహా కర్ణాటకలోని అన్ని ప్రాంతాలకు సర్వీసులను అందుబాటులో ఉంచుతుంది. కర్ణాటకలో వారాంత కర్ఫ్యూ దృష్ట్యా సర్వీసులను నిలిపివేయనుంది. దీంతో శుక్రవారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు బస్సులను బంద్‌ చేయనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

Ali: అలీ క్లాప్ తో ప్రారంభమైన చండీ దుర్గమా సినిమా

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments