ప్రయాణీకులకు మరో షాక్: పెరిగిన బస్ పాస్ ధరలు

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (19:21 IST)
ప్రయాణీకులకు మరో షాక్ ఇచ్చింది టీఎస్‌ఆర్టీసీ. బస్ పాస్ ధరలను భారీగా పెంచేసింది.  జనరల్ ఆర్డినరీ బస్ పాస్ ధర రూ.970 నుంచి రూ.1150కి పెంపునట్లు తెలిపింది. మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాస్ ధర రూ.1070 నుంచి రూ.1300 చేసినట్లు వెల్లడించింది. 
 
ఇక మెట్రో డీలక్స్ ధర రూ.1185 నుంచి రూ.1450కి పెంచినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ బస్ పాస్ ధర రూ. 1100 నుంచి రూ.1350కి పెంచారు.  
 
పుష్పక్ ఏసీ పాస్ ధర గతంలో రూ.2500 ఉండగా..ప్రస్తుతం రూ.3000‌కు చేరింది. పెరిగిన బస్ పాస్ ధరలు శుక్రవారం నుంచి అమలు అవుతాయని టీఎస్సార్టీసీ వెల్లడించింది.
 
ఇప్పటికే.. ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్ పేరుతో ఛార్జీలను రౌండప్‌ చేశారు. అలాగే  సెస్ పేరిట ఎక్స్​ప్రెస్, డీలక్స్ బస్సుల్లో రూ.5 పెంచారు. సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో రూ.10 వరకు ఛార్జీలను పెంచేశారు. తాజాగా బస్సు పాస్ ధరలు కూడా పెరిగిపోయాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Virosh couple : అమిత్ షా, ప్రధానిని కలిసిన విరోష్ జంట

Vishnu Vinyasam Review: శ్రీ విష్ణు చేసిన విష్ణు విన్యాసం.. బెడిసి కొట్టిందా? రివ్యూ

Rajiv Kanakala: ఓటీటీ చిత్రం D/o ప్రసాద్ రావు : కనబడుటలేదు రివ్యూ

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త పోస్టర్ - త్వరలోనే ప్రత్యేక గ్లింప్స్‌

సినీనటి కిడ్నాప్ కేసు- దిలీప్‌కు షాక్.. కేరళ హైకోర్టులో అప్పీల్ దాఖలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

వయసు పైబడకుండా చేసే బాదం పప్పు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?

తులసి రసంతో తేనెను కలిపి తీసుకుంటే ఏమవుతుంది?

మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

తర్వాతి కథనం
Show comments