ఆర్టీసీ టికెట్‌తో సులభంగా శ్రీవారి దర్శనం

Webdunia
ఆదివారం, 19 మార్చి 2023 (11:38 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్టీసీ బస్సుల్లో నడిపేవారు తిరుమల శ్రీవారిని సులభంగా, శీఘ్రంగా ప్రత్యేక దర్శనం చేసుకోవచ్చని ఆ సంస్థ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి ఆర్టీసీ బస్సులు నడుపుతోందని, ప్రతి రోజు వెయ్యి మంది ప్రయాణికులకు రూ.300 శీఘ్ర దర్శన టికెట్లు ఇచ్చేందుకు అవకాశం ఉందన్నారు. దీన్ని భక్తులు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.
 
ఈ నెల 18 వరకు టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో వెళ్లిన 1,14,565 మంది ప్రయాణికులకు తిరుమలలో ప్రత్యేక దర్శనం లభించిందని శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. తిరుమలలో భక్తుల రద్దీ, సాధారణంగా వెళ్లేవారికి దర్శనానికి పట్టే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు వెళ్లాలని, తద్వారా శ్రీవారి దర్శనం త్వరగా అవుతుందని సూచించారు. 
 
తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్‌సైట్‌ ద్వారా రూ.300 టికెట్‌తో దర్శనం చేసుకోవాలంటే నెలరోజుల పాటు వేచి ఉండాల్సి వస్తోందని, అదే టీఎస్‌ఆర్టీసీ ద్వారా అయితే వారం రోజులు చాలని బాజిరెడ్డి తెలిపారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన బస్సుల్ని తిరుపతికి నడిపిస్తున్నట్లు వివరించారు. తిరుమల వెళ్లే భక్తులు మరిన్ని వివరాలకు టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌ www.tsrtconline.in చూడాలని ఆయన సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

తర్వాతి కథనం
Show comments