Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో లాక్డౌన్ సడలింపులు... సాయంత్రం 6 గంటల వరకు బస్సులు

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (10:26 IST)
తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ సండలింపులు కొనసాగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు  బస్సులను నడుపుతున్నారు. లాక్‌డౌన్‌ సడలింపులకు అనుగుణంగా బస్సులను తిప్పాలని ఆర్టీసీ నిర్ణయించింది. గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం ఆరు గంటల వరకు వీటిని నడపనున్నట్లు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ ఆపరేషన్స్‌) యాదగిరి చెప్పారు. 
 
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,600 బస్సులు తిప్పుతున్నట్టు చెప్పారు. ఇవికాకుండా మరో 800 వరకు సిటీ బస్సులను నడపనున్నామన్నారు. మే 12 నుంచి ప్రభుత్వం లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా.. దీనిని మరో 10 రోజులు పొడిగించింది. సడలింపు వేళలను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రకటించగా.. ఇళ్లకు చేరే సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు అనుమతించింది. 
 
ఈ వెసులుబాటు సమయాలకు అనుగుణంగా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బస్సులను ఆర్టీసీ తిప్పనుంది. ఆర్టీసీలో అద్దె బస్సులు సహా ఉన్న 9000కు పైగా బస్సుల్లో.. ఇప్పుడు 3,600 బస్సులు తిరుగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu Review: హరిహర వీరమల్లు మూవీలో హిందూధర్మం వుందా? మూవీ రివ్యూ

Rajeev Kanakala: రాజీవ్ కనకాలకు నోటీసులు జారీ.. ఆరోగ్యం బాగోలేదు

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments