Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైవేద్య విరామంలో శ్రీవారిని దర్శనం చేసుకున్న రేవంత్ రెడ్డి దంపతులు

Webdunia
ఆదివారం, 12 నవంబరు 2023 (12:52 IST)
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దంపతులు ఆదివారం శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం నైవేద్య విరామంలో ఆయన తన కుటుంబంతో కలిసి స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి చెందాలని స్వామిని కోరుకున్నట్టు చెప్పారు. ముఖ్యంగా, రెండు తెలుగు రాష్ట్రాలు కలిసికట్టుగా ఉండాలని వేంకటేశ్వర స్వామిని ప్రార్థించానని తెలిపారు. 
 
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత ఆలయ పండితులు రంగనాయకుల మండపంలో రేవంత్ రెడ్డికి వేద ఆశీర్వాదం, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. స్వామివారి పట్టువస్త్రాలతో పాటు తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. 
 
ఆ తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని స్వామిని కోరుకున్నట్టు తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య ఆర్థిక, రాజకీయ సంబంధాలు బాగుండాలన ప్రార్థించినట్టు వివరించారు. తెలంగాణాకు మంచి రోజులు రాబోతున్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Rohit: తను నా లక్కీ చార్మ్.. అందుకే సుందరకాండ చేశాం : నారా రోహిత్

బార్బరిక్.. ఫ్రీగా చూడాల్సిన మూవీ కాదని వాళ్లు డబ్బులు ఇచ్చారు : విజయ్ పాల్ రెడ్డి

సినిమాల్లోనే కాదు.. వ్యక్తిగతంగా లోపాలను వెతుకుతున్నారు : అనుపమ పరమేశ్వరన్

కపుల్ ఫ్రెండ్లీ లో సంతోష్ శోభన్, మానస వారణాసి ల కెమిస్ట్రీ సాంగ్

పవన్ చేతిపై ఉన్న టాటూ అక్షరాలకు అర్థమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

తర్వాతి కథనం
Show comments