నైవేద్య విరామంలో శ్రీవారిని దర్శనం చేసుకున్న రేవంత్ రెడ్డి దంపతులు

Webdunia
ఆదివారం, 12 నవంబరు 2023 (12:52 IST)
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దంపతులు ఆదివారం శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం నైవేద్య విరామంలో ఆయన తన కుటుంబంతో కలిసి స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి చెందాలని స్వామిని కోరుకున్నట్టు చెప్పారు. ముఖ్యంగా, రెండు తెలుగు రాష్ట్రాలు కలిసికట్టుగా ఉండాలని వేంకటేశ్వర స్వామిని ప్రార్థించానని తెలిపారు. 
 
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత ఆలయ పండితులు రంగనాయకుల మండపంలో రేవంత్ రెడ్డికి వేద ఆశీర్వాదం, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. స్వామివారి పట్టువస్త్రాలతో పాటు తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. 
 
ఆ తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని స్వామిని కోరుకున్నట్టు తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య ఆర్థిక, రాజకీయ సంబంధాలు బాగుండాలన ప్రార్థించినట్టు వివరించారు. తెలంగాణాకు మంచి రోజులు రాబోతున్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments