Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభానికి దూరంగా మంత్రి కేటీఆర్

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (12:15 IST)
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయ కార్యాలయాన్ని బుధవారం ఢిల్లీలో ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం బీఎర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే హస్తినకు చేరుకున్నారు. అలాగే, తెరాస మంత్రులు, ఎంపీలు కూడా అక్కడే ఉన్నారు. అయితే, సీఎం కేసీఆర్ తనయుడు, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మాత్రం ఈ ప్రారంభోత్సవానికి దూరంగా ఉన్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 
 
ఇప్పటికే ఖరారైన అధికారిక కార్యక్రమాల నేపథ్యంలో బీఎర్ఎస్ పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన దూరంగా ఉన్నారు. ముఖ్యంగా, జపాన్ బిజినెస్ వరల్డ్ లీడర్స్‌తో సమావేశం ఉన్న నేపథ్యంలో కేటీఆర్ బీఎర్ఎస్ ప్రారంభోత్సవానికి దూరంగా ఉన్నారు. 
 
మరోవైపు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామితో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నేతలు కూడా హాజరుకానున్నారు. ఇందుకోసం తెరాస భారీ ఏర్పాట్లు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments