Webdunia - Bharat's app for daily news and videos

Install App

గవర్నర్ నోరు పారేసుకోవడం మానుకోవాలి : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (16:50 IST)
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌పై తెలంగాణ మంత్రులు ఒక్కొక్కరుగా మండిపడుతున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన ఆమె కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై ఓ నివేదిక సమర్పించినట్టు సమాచారం. పైగా, ప్రభుత్వ ఉన్నతాధికారులైన సీఎస్, డీజీపీల తీరును ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. పనిలోపనిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై  సీరియస్ వ్యాఖ్యలు చేశారు. 
 
ఈ వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ ఖండించారు. గవర్నర్‌తో తమకెలాంటి పేచీ లేదని స్పష్టం చేశారు. అయితే మరో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాత్రం ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించారు. గవర్నర్ నోరు పారేసుకోవడం మానుకోవాలంటూ హితవు పలికారు. తమిళిసై వక్రబుద్ధితో వ్యవహరిస్తున్నారంటూ ఘాటైన విమర్శలు చేసారు. ప్రభుత్వం ఎక్కడ అవమానించిందో గవర్నర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
గవర్నర్ తన పరిధిలో ఉంటే ప్రతి ఒక్కరూ గౌరవిస్తారన్నారు. ఉగాది నాడు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా యాదాద్రికి వెళ్లారంటూ పేర్కొన్నారు. కేవలం 20 నిమిషాల ముందు చెబితే ప్రోటోకాల్ పాటించడం ఎలా సాధ్యపడుతుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments