లా సెట్ నోటిఫికేషన్ - 6 నుంచి దరఖాస్తుల స్వీకరణ

Webdunia
ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (12:53 IST)
తెలంగాణ రాష్ట్రంలో న్యాయ విద్యా కోర్సుల ప్రవేశానికి నిర్వహించే లా సెట్‌ నోటిఫికేషన్‌ను జారీ అయింది. మూడు, ఐదేళ్ల లా కోర్సులతో పాటు ఎంఎల్ఎం కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌లాసెట్, పీజీఎల్‌సెట్ నోటిఫికేషన్ శనివారం రిలీజ్ చేశారు. 
 
ఈ నోటిఫికేషన్ ప్రకారం ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 6 నుంచి జూన్ 6న తేదీ వరకు కొనసాగుతుంది. ఎల్ఎల్‌బీకి ఎస్టీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500, ఇతరులు రూ.1000 చొప్పున దరఖాస్తు ఫీజును చెల్లించాల్సివుంటుంది. ఈ పరీక్షలు జూన్ 21, 22 తేదీల్లో నిర్వహిస్తారు. ఎల్ఎల్బీలో ప్రవేశానికి డిగ్రీ లేదా ఇంటర్ జనరల్, బీసీ, ఎస్టీ, ఎస్సీ విద్యార్థులు 45, 42, 40 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి. 
 
2022-23 విద్యా సంవత్సరానికిగాను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, కేయూ వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేష్, మహాత్మా గాంధీ వీసీ ప్రొఫెసర్ గోపాలరెడ్డి, ఉన్నత విద్యా మండలి కార్యదర్శి డాక్టర్ శ్రనివాస రావు, లా సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జీవీ రెడ్డిలు ఈ నోటిఫికేషన్‌ను చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 6వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. పూర్తి వివరాల కోసం లాసెట్ వెబ్ సైట్‌ను పరిశీలించవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

5 ఏళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కడుతున్నాను: మంచు లక్ష్మి

పెద్దలకు భయపడి ప్రత్యూష చిత్రం నుంచి తప్పుకున్నారు : సత్యారెడ్డి

Vijay Antony: బుకీ తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుంది : విజయ్ ఆంటోనీ

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ - ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్‌ ను అనౌన్స్ చేసిన జియోహాట్‌స్టార్

Karthi: ఆది పినిశెట్టి హీరోగా మరకతమణి 2 పూజతో ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

తర్వాతి కథనం
Show comments