Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రోటోకాల్ గురించి సీఎస్‌కు తెలియదా.. ఇగో మనిషిని కాదు : గవర్నర్ తమిళిసై

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (18:36 IST)
తాను ఇగోలకు పోయే మనిషిని కాదని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. పైగా, ప్రొటోకాల్ గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలియదా అంటూ ఆమె మండిపడ్డారు. 
 
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆమె తొలుత కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీలతో సమావేశమయ్యారు. ప్రధానితో భేటీ ముగిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఎలాంటి సేవ చేయని వ్యక్తిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎలా నామినేట్ చేయాలని ప్రశ్నించారు. అందుకే ఆ ఫైలును తిరస్కరించి, తన మనోగతానాన్ని కూడా ప్రభుత్వానికి తెలియజెప్పానని తెలిపారు. 
 
అదేసమయంలో ఒక వ్యక్తినికాకుండా ఒక వ్యవస్థను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. తనకు ఎలాంటి ఇగోలు లేవన్నారు. తాను వివాదాస్పద వ్యక్తిని కాదని, బాధ్యత కలిగిన వ్యక్తినని చెప్పారు. సీఎం లేదా మంత్రులు ఎపుడైనా తనను కలవచ్చన్నారు. తాను సీఎం కేసీఆర్ గురించి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి రాలేదని రాష్ట్రంలోని గిరిజన సమస్యలు, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరేందుకు వచ్చినట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments