Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రోటోకాల్ గురించి సీఎస్‌కు తెలియదా.. ఇగో మనిషిని కాదు : గవర్నర్ తమిళిసై

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (18:36 IST)
తాను ఇగోలకు పోయే మనిషిని కాదని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. పైగా, ప్రొటోకాల్ గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలియదా అంటూ ఆమె మండిపడ్డారు. 
 
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆమె తొలుత కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీలతో సమావేశమయ్యారు. ప్రధానితో భేటీ ముగిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఎలాంటి సేవ చేయని వ్యక్తిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎలా నామినేట్ చేయాలని ప్రశ్నించారు. అందుకే ఆ ఫైలును తిరస్కరించి, తన మనోగతానాన్ని కూడా ప్రభుత్వానికి తెలియజెప్పానని తెలిపారు. 
 
అదేసమయంలో ఒక వ్యక్తినికాకుండా ఒక వ్యవస్థను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. తనకు ఎలాంటి ఇగోలు లేవన్నారు. తాను వివాదాస్పద వ్యక్తిని కాదని, బాధ్యత కలిగిన వ్యక్తినని చెప్పారు. సీఎం లేదా మంత్రులు ఎపుడైనా తనను కలవచ్చన్నారు. తాను సీఎం కేసీఆర్ గురించి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి రాలేదని రాష్ట్రంలోని గిరిజన సమస్యలు, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరేందుకు వచ్చినట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments