Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో ఆత్మహత్యలపై నివేదిక కోరిన గవర్నర్ తమిళిసై

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (09:28 IST)
తెలంగాణా రాష్ట్రంలోని ఖమ్మ, కామారెడ్డి జిల్లాల్లో జరిగిన రెండు ఆత్మహత్య ఘటనలపై ఆ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రభుత్వ అధికారులను నివేదిక కోరారు. ఈ మేరకు ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. 
 
ఇటీవల ఖమ్మం జిల్లాలో సామినేని సాయి గణేష్, కామారెడ్డి జిల్లాలో తల్లీ కుమారుల ఆత్మహత్యల ఘటనలు సంభవించాయి. ఇవి రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. అయితే, ఈ ముగ్గురు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లేదా సానుభూతిపరులని వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యలు చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. కానీ, బీజేపీ నేతలు మాత్రం తెరాస నేతల వేధింపుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఆరోపిస్తున్నారు. ఈ ఆత్మహత్యలపై వారు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు కూడా చేశారు.
 
ఈ నేపథ్యంలో ఈ రెండు జిల్లాల్లో జరిగిన ఆత్మహత్యల ఘటనపై గవర్నర్ తమిళిసై సమగ్ర నివేదిక కోరారు. అలాగే, ప్రైవేటు వైద్య కాలేజీలకు పీజీ సీట్లను బ్లాక్ చేసి అడ్దదారిలో విక్రయిస్తున్నట్టు వస్తున్న ఆరోపణలపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దీనిపై కూడా నివేదిక కోరారు. ఈ మేరకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ వీసీని ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాస్తికులు-ఆస్తికులు అనే కాన్సెప్ట్‌ తో కన్నప్ప రూపొందింది : చిత్ర యూనిట్

పనిచేసే యువతితో సైఫ్ అలీఖాన్ రాసలీలలు, కోపమొచ్చి పొడిచిన ప్రియుడు?!!

తల్లి మనసు లాంటి చిత్రాలను ఆదరిస్తే మరిన్ని వస్తాయి: ముత్యాల సుబ్బయ్య

జైపూర్ చలనచిత్రోత్సవంలో బెస్ట్ పోలిటికల్ మూవీ గా రైమా సేన్.. మా కాళి

ధనుష్ దర్శకత్వంలో జాబిలమ్మ నీకు అంత కోపమా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments