Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో ఆత్మహత్యలపై నివేదిక కోరిన గవర్నర్ తమిళిసై

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (09:28 IST)
తెలంగాణా రాష్ట్రంలోని ఖమ్మ, కామారెడ్డి జిల్లాల్లో జరిగిన రెండు ఆత్మహత్య ఘటనలపై ఆ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రభుత్వ అధికారులను నివేదిక కోరారు. ఈ మేరకు ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. 
 
ఇటీవల ఖమ్మం జిల్లాలో సామినేని సాయి గణేష్, కామారెడ్డి జిల్లాలో తల్లీ కుమారుల ఆత్మహత్యల ఘటనలు సంభవించాయి. ఇవి రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. అయితే, ఈ ముగ్గురు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లేదా సానుభూతిపరులని వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యలు చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. కానీ, బీజేపీ నేతలు మాత్రం తెరాస నేతల వేధింపుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఆరోపిస్తున్నారు. ఈ ఆత్మహత్యలపై వారు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు కూడా చేశారు.
 
ఈ నేపథ్యంలో ఈ రెండు జిల్లాల్లో జరిగిన ఆత్మహత్యల ఘటనపై గవర్నర్ తమిళిసై సమగ్ర నివేదిక కోరారు. అలాగే, ప్రైవేటు వైద్య కాలేజీలకు పీజీ సీట్లను బ్లాక్ చేసి అడ్దదారిలో విక్రయిస్తున్నట్టు వస్తున్న ఆరోపణలపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దీనిపై కూడా నివేదిక కోరారు. ఈ మేరకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ వీసీని ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments