తెలంగాణాలో నేటి నుంచి ఎంసెట్ - నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

Webdunia
సోమవారం, 18 జులై 2022 (12:57 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం ప్రవేశ అర్హత పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. సోమ, మంగళ, బుధవారాల్లో జరిగే ఈ పరీక్షలు ప్రతి రోజూ రెండు సెషన్స్‌లలో నిర్వహిస్తారు. ఉదయం 9 గంట నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. 
 
ఆన్‌లైన్‌లో నిర్వహించే ఈ పరీక్షలకు నియమ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. అలాగే,  పరీక్షా కేంద్రానికి నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించబోమని చెప్పారు. అందువల్ల విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
 
మొత్తం మూడు రోజుల పాటుసాగే ఈ పరీక్షలకు 1,72,241 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరి కోసం 108 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఎంసెట్ కన్వీనర్ ఎ.గోవర్థన్ తెలిపారు. ఇందులో తెలంగాణాలో 89, ఏపీలో 19 చొప్పున ఉన్నాయన్నారు. 
 
విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి హాల్ టికెట్, గుర్తింపు కార్డుగా ఆధార్ కార్డు తీసుకురావాలని చెప్పారు. మొబైల్ ఫోన్లు, వాచీలు, కాలిక్యులేటర్‌లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు. కాగా, ఈ నెల 14, 15వ తేదీల్లో జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ విభాగం అర్హత పరీక్షలు భారీ వర్షాల కారణంగా వాయిదా వేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anushka Shetty: స్వీటీ అనుష్క శెట్టి పెళ్లి చేసుకుంటుందా?

Ustaad Bhagat Singh: ఎంటర్ టైన్ మెంట్, దేశభక్తి కలగలిపిన ట్రైలర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ఆకట్టుకున్నాడు

మేడ్ ఇన్ కొరియా చిత్రీకరణ ఆనందించదగ్గ అనుభవం : ప్రియాంక మోహన్.

S.P. Charan: ఎస్పీ చరణ్, కేఎస్ చిత్ర పాడిన మెలోడీ బంగారు బొమ్మ సాంగ్ రిలీజ్

Rashmika: విజయ్ దేవరకొండ కోసం పోరాటం చేసిన రష్మిక మందన్న వీడియో రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీర మర్దనకు ఎలాంటి నూనెలు వాడాలి?

పొట్ట మసాజ్, ప్రయోజనాలు ఏమిటి?

డయాబెటిస్‌, గుండె, మూత్రపిండాల ప్రమాదాలను ముందస్తుగా గుర్తించడానికి అబోట్ ICRAS సాధనం

నల్ల ద్రాక్షలో వున్న పోషకాలు ఏమిటి? వాటి ప్రయోజనాలు ఏమిటి?

అల్లంతో గృహవైద్యం అంటారు, ఎందుకు?

తర్వాతి కథనం
Show comments