Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో నేటి నుంచి ఎంసెట్ - నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

Webdunia
సోమవారం, 18 జులై 2022 (12:57 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం ప్రవేశ అర్హత పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. సోమ, మంగళ, బుధవారాల్లో జరిగే ఈ పరీక్షలు ప్రతి రోజూ రెండు సెషన్స్‌లలో నిర్వహిస్తారు. ఉదయం 9 గంట నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. 
 
ఆన్‌లైన్‌లో నిర్వహించే ఈ పరీక్షలకు నియమ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. అలాగే,  పరీక్షా కేంద్రానికి నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించబోమని చెప్పారు. అందువల్ల విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
 
మొత్తం మూడు రోజుల పాటుసాగే ఈ పరీక్షలకు 1,72,241 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరి కోసం 108 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఎంసెట్ కన్వీనర్ ఎ.గోవర్థన్ తెలిపారు. ఇందులో తెలంగాణాలో 89, ఏపీలో 19 చొప్పున ఉన్నాయన్నారు. 
 
విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి హాల్ టికెట్, గుర్తింపు కార్డుగా ఆధార్ కార్డు తీసుకురావాలని చెప్పారు. మొబైల్ ఫోన్లు, వాచీలు, కాలిక్యులేటర్‌లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు. కాగా, ఈ నెల 14, 15వ తేదీల్లో జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ విభాగం అర్హత పరీక్షలు భారీ వర్షాల కారణంగా వాయిదా వేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

Ravi Teja: మాస్ జాతర కోసం సబ్ ఇన్ స్పెక్టర్ లక్మణ్ భేరి ఏం చేశాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments