మంత్రి కేటీఆర్ అండతోనే డ్రగ్ మాఫియా చెలరేగుతోంది : మహేష్ కుమార్

Webdunia
ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (16:57 IST)
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్ మాఫియా చెలరేగిపోవడానికి ప్రధాన కారణం ఆ రాష్ట్ర మంత్రి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. 
 
ఆదివారం వేకువజామున హైదరాబాద్ నగరంలోని రాడిసన్ బ్లూ ప్లాజాలోని ఫుడింగ్ మింక్ పబ్‌లో జూబ్లీ హిల్స్ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో అనేక మంది రాజకీయ, సినీ ప్రముఖుల పిల్లలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేసమయంలో ఈ దాడులు జరిపిన పోలీసులపై కూడా పోలీస్ ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. 
 
ఈ అంశంపై మహేశ్ కుమార్ మాట్లాడుతూ, కేటీఆర్ అండదండలతోనే హైదరాబాద్ నగరంలో డ్రగ్ మాఫియా చెలరేగిపోతుందని ఆరోపించారు. ఎవరి అండ లేకపోతే పబ్‌లను అర్థరాత్రి దాటిన తర్వాత 3 గంటల వరకు ఎలా తెరిచి వుంచుతున్నారని ఆయన ప్రశ్నించారు. 
 
ఫుడింగ్ మింక్ పబ్‌పై దాడులు జరిపిన పోలీసుల్లో ఏసీపీకి చార్జ్ మెమో ఇవ్వడం, సీఐను సస్పెండ్ చేయడం సరికాదన్నారు. వారిని అభినందించాల్సిన ఉన్నతాధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి వారిపైనే చర్యలు తీసుకోవడం న్యాయం కాదన్నారు. డ్రగ్స్‌ను అరికట్టే విషయంలో ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి వున్నా ఎన్సీబీ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసి డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉన్నవారిని శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments