Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందువుల ఇళ్లనే జీహెచ్ఎంసీ అధికారులు టార్గెట్ చేశారు : బండి సంజయ్

Webdunia
గురువారం, 29 జులై 2021 (11:45 IST)
గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) అధికారులపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. భాగ్యనగరిలో హిందువుల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారంటూ మండిపడ్డారు. అదేసమయంలో ముస్లిం ప్రభావిత ప్రాంతాలకు మినహాయింపు ఇస్తున్నారని విమర్శించారు.
 
ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగరంలోని పలు అక్రమ నివాసాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. వీటిపై బండి సంజయ్ స్పందించారు. జీహెచ్ఎంసీ అధికారులు, మేయర్ కలిపి అక్రమ కట్టడాలు కూల్చివేయాలని నిర్ణయించి కేవలం హిందువుల ఇళ్లను మాత్రమే టార్గెట్ చేస్తున్నారంటూ ఆరోపించారు. 
 
కేవలం హిందువుల ఇళ్లను కూల్చివేయడం దుర్మార్గమన్నారు. ఎంఐఎం శాసనసభ్యుల ప్రాంతాలైన చార్మినార్ జోన్, ఖైరతాబాద్ జోన్లకు మినహాయింపు ఇవ్వడం అన్యాయమని విమర్శించారు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఎంఐఎం శాసన సభ్యుల నియోజకవర్గాలు అంటే ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాలన్నారు. వీటిని మినహాయింపు ఇచ్చి అక్రమ నిర్మాణాల పేరిట కూల్చివేతలు కొనసాగిస్తున్నారన్నారు. ఇది ఒక రకంగా మెజారిటీలపై ప్రభుత్వం చేస్తున్న దాడిగా ఆయన అభివర్ణించారు.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments