Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ ముక్త్ భారత్‌కు శ్రీకారం : విజయశాంతి

Webdunia
శుక్రవారం, 11 మార్చి 2022 (09:20 IST)
కాంగ్రెస్ ముక్త్ భారత్‌కు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ మహిళా నేత, సినీ నటి విజయశాంతి అన్నారు. తాజాగా వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆమె స్పందిస్తూ మన దేశానికి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి విముక్తి లభించనుందని జోస్యం చెప్పారు. 
 
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యవేక్షణలోని బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో విజయభేరీ మోగించింది. ఈ విజయంతో ప్రజల హృదయాలలో బీజేపీ, ప్రధాని మోడీ చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు. 
 
ప్రతిపక్ష నేతలంతా కాళ్లకు బలపాలు కట్టుకుని మరీ బీజేపీపై పగబట్టినట్టుగా ప్రచారంతో పాటు దుష్ప్రచారం చేశారని, కానీ, ఓటర్లు విజ్ఞతతో తీర్పునిచ్చారని, ఈ తీర్పుతో ప్రతిపక్షాలకు నిరాశ తప్పలేదన్నారు. 
 
మరీ ముఖ్యంగా... వైరి పక్షాలన్నీ బూచిగా చూపిన వ్యవసాయ చట్టాల ప్రభావం ఏమీ లేదని తేలిపోయిందని విజయశాంతి అన్నారు. బీజేపీపై ఎన్ని కట్టుకథలు అల్లినా నిజమేంటో ఓటర్లు గ్రహించి అధికార పీఠాన్ని బీజేపీకే అప్పగించాలని నిర్ణయించారని చెప్పారు. 
 
జాతీయవాదంతో జాతి సమగ్రత, సమైక్యత  లక్ష్యంగా కొనసాగుతున్న బీజేపీ పాలనకు ఒక గొప్ప ఉదాహరణగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకోవాలని,  అందుకే 37 సంవత్సరాల తర్వాత రెండోసారి వరుసగా యోగి సర్కారు అధికారాన్ని దక్కించుకుందని రాములమ్మ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments