Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలోని మసీదులన్నీ తవ్వాల్సిందే : బండి సంజయ్

Webdunia
గురువారం, 26 మే 2022 (11:50 IST)
తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ జెట్ స్పీడును ప్రదర్శిస్తున్నారు. అధికార తెరాస పార్టీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇపుడు పెద్ద దుమారాన్ని రేపాయి. తెలంగాణాలోని మసీదులన్నీ తవ్వాలని, ఈ తవ్వకాల్లో శవాలు వస్తే మీవి.. శివలింగాలు వస్తే మావి అంటూ వ్యాఖ్యానించారు. 
 
ఇప్పటికే ఉత్తరాదికే పరిమైన మందిర్ - మసీదు వివాదాన్ని ఆయన తెలంగాణాకు తీసుకొచ్చారు. మంగళవారం జరిగిన హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ఆయన వివాదాస్పద ప్రసంగం చేశారు. 
 
తెలంగాణాలో ఉన్న మసీదులన్నింటినీ తవ్వాలని పిలుపునిచ్చారు. ఈ తవ్వకాల్లో శవం కనిపిస్తే ఆ మసీదును మీకే వదిలేస్తామని, శివలింగం వస్తే మాత్రం మేము తీసుకుంటామని అన్నారు. 
 
కాగా, ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగం బయటపడిన విషయం తెల్సిందే. దీన్ని ప్రధానంగా ప్రస్తావించిన బండి సంజయ్... తెలంగాణాలోని మసీదులను తవ్వినా శివలింగాలు బయటపడతాయన్నారు. తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని మదర్సాలను మూసివేస్తామని ఆయన ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments