Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా పోచారం : లక్ష్మీపుత్రుడన్న సీఎం కేసీఆర్

Webdunia
శుక్రవారం, 18 జనవరి 2019 (12:31 IST)
తెలంగాణ రాష్ట్ర రెండో శాసనసభ సభాపతిగా పోచారం శ్రీనివాస రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి ఎన్నిక జరుగగా, పోచారం ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. దీంతో పోచారం సభాపతి కుర్చీలో కూర్చొని సభా కార్యక్రమాలను కొనసాగించారు. 
 
ఇదిలావుంటే, పోచారం సేవలను గుర్తు చేసిన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా ఎన్నికైన పోచారం తనకు పెద్దన్నలాంటివారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పదవి, టీడీపీ సభ్యత్వానికి పోచారం రాజీనామా చేశారని  ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
 
పోచారం గతంలో ఎన్నో సమర్థమైన పదవులు చేపట్టారని గుర్తు చేసిన సీఎం కేసీఆర్... పోచారం వ్యవసాయ శాఖామంత్రిగా ఉన్న సమయంలోనే ఐక్యరాజ్య సమితితో పాటు ప్రపంచమంతా గుర్తించిన రైతుబంధు పథకాన్ని అమలు చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తుచేశారు. ఇపుడు ఈ రైతుబంధు పథకం ఎన్నో రాష్ట్రాలకు స్ఫూర్తినిస్తుందన్నారు. ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలు ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారని సభకు సీఎం కేసీఆర్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments