Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా జపం చేయనిదే చంద్రబాబుకు నిద్రపట్టదు : తెరాస నేతలు

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2015 (08:52 IST)
పొద్దస్తమానం తమ జపం చేయనిదే టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి నిద్రపట్టదని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు అంటున్నారు. ఏపీ అసెంబ్లీ విపక్ష నేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి విసిరే సవాళ్ళకు, ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, వాటి నుంచి తప్పించుకునేందుకు తమ గురించి ప్రస్తావించడం చంద్రబాబుకు అనవాయితీగా మారిపోయిందని మండిపడ్డారు. 
 
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఇతర మంత్రుల పేర్లను ప్రస్తావిస్తూ చంద్రబాబు అనేక ఆరోపణలు చేసిన విషయంతెల్సిందే. వీటిపై తెరాస ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజులు స్పందించారు. ఏపీ అసెంబ్లీలో తమ నేత కేసీఆర్, తెరాస మంత్రుల పేర్లను ప్రస్తావిస్తే సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 
 
చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను పక్కనబెట్టి రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని, ఆయన ముమ్మాటికీ దొంగేనన్నారు. చంద్రబాబు తీరుపై ఏపీ ప్రజలకు అసహ్యం కలుగుతోందని, జగన్‌ సవాళ్లకు సమాధానం చెప్పలేక ఆయన తెలంగాణ అంశాన్ని లేవనెత్తుతున్నారన్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌ రెడ్డి మాదిరిగా చంద్రబాబును కూడా కుప్పంకే పరిమితం చేయాలని కోర్టును కోరనున్నట్టు తెలిపారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments