తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీవీ కుమార్తె.. నామినేషన్‌ తిరస్కరించిన అధికారులు

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (20:03 IST)
తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానం నుంచి ఆమె బరిలోకి దిగుతున్నారు. ఇందుకోసం ఆమెకు సీఎం కేసీఆర్ బీ-ఫారం అందించారు. 
 
అయితే నామినేషన్ వేసేందుకు ఎంతో ఉత్సాహంతో వెళ్లిన వాణీదేవికి నిరాశ ఎదురైంది. నామినేషన్ పత్రాలు సరైన ఫార్మాట్లో లేవని అధికారులు తిరస్కరించారు. అప్పటికే సమయం మించిపోవడంతో వాణీదేవి నిరాశతో వెనుదిరిగారు. దాంతో ఆమె మంగళవారం ఉదయం నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నారు.
 
కాగా, పీవీ కుమార్తెకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిన నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు అధికార తెరాసపై భగ్గుమంటున్నారు. ఓడిపోయే స్థానంలో అవకాశం ఇచ్చి పీవీ కుటుంబాన్ని అవమానిస్తున్నారని విమర్శిస్తున్నారు. 
 
అలాగే, పీవీ మనవడు, బీజేపీ నేత ఎన్వీ సుభాష్ స్పందించారు. ఎలాంటి గెలుపు అవకాశాలు లేని స్థానంలో తన చిన్నమ్మ వాణీదేవికి టికెట్ ఇచ్చారని ఆరోపించారు. ఓడిపోతుందని తెలిసీ టికెట్ ఇవ్వడం మోసం చేయడమేనని విమర్శించారు. 
 
ఓ మహనీయుడి పేరు చెప్పుకుని కుటిల రాజకీయాలకు పాల్పడ్డారని సుభాష్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబాన్ని మోసం చేయడమే కాదని, బ్రాహ్మణ సమాజం ఓట్లు చీల్చే ప్రయత్నమని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments