Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ తరపున పోటీ చేస్తానంటున్న నటి రేష్మా రాథోడ్

Webdunia
సోమవారం, 15 అక్టోబరు 2018 (11:14 IST)
భారతీయ జనతా పార్టీ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానంటూ నటి రేష్మా రాథోడ్ వ్యాఖ్యానిస్తోంది. ఈమె ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా విధులు నిర్వహిస్తోంది. 
 
ఖమ్మం జిల్లా జూలూరుపాడులోని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు చిలుకూరి రమేష్‌ గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నో రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ వాటిని అమలు చేయడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆమె ఆరోపించారు. 
 
పార్టీ ఆదేశిస్తే వైరా నియోజకవర్గంనుంచి తాను పోటీచేస్తానని తెలిపారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ తెరాస ప్రభుత్వం సహకరించకుండా దానిని మెదక్‌కు తరలించాలని చూసిందని ఆరోపించారు. 
 
బీజేపీ తెలంగాణాలో అధికారంలోకి వస్తే బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసి వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments