Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నగరానికి ఏమైంది.. ఎక్కడ చూసినా టూ-లెట్ బోర్డులే!

Webdunia
సోమవారం, 6 జులై 2020 (10:55 IST)
దేశాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. అయితే, ఈ వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా ఉంది. ముంబై, చెన్నై, బెంగుళూరు తర్వాత హైదరాబాద్ నగరంలో భారీ సంఖ్యలో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. దీంతో హైదరాబాద్ నగర వాసులు వణికిపోతున్నారు. 
 
అదేసమయంలో హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు వీలుగా మరోమారు లాక్డౌన్ విధించవచ్చన్న ఊహాగానాలు వస్తున్నాయి. దీంతో హైదరాబాద్ నగరేతులు తమతమ ఇళ్ళను ఖాళీ చేసి సొంతూళ్ళకు వెళ్లిపోయారు. దీంతో అనేక గృహాలకు టూలెట్ బోర్డులు వేలాడుతున్నాయి. 
 
ప్రధానంగా ఐటీ ఉద్యోగులంతా నగరాన్ని వీడి తమతమ సొంతూళ్ళకు వెళ్లిపోయారు. ఐటీ ఉద్యోగులకంతా వర్క్  ఫ్రమ్ హోం సౌకర్యం కల్పించడంతో నూటికి 90 శాతం మంది ఉద్యోగులు తమ ఫ్లాట్స్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయారు. అలాగే, వ్యాపారులు కూడా కరోనా వైరస్ భయం కారణంగా తమ షాపులను మూసివేశారు. ఫ్యాక్టరీలు కూడా మూతపడ్డాయి. 
 
వ్యాపార సంస్థలు, షాపింగ్ మాల్స్‌లలో పని చేసే వారంతా సొంతూళ్ళకు వెళ్లిపోయారు. ఈ కారణంగా హైదరాబాద్ నగరంలో జనాభా గణనీయంగా తగ్గిపోయింది. దీనికితోడు గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో లాక్డౌన్ 2 అమలు చేయనున్నారనే వార్తల నేపథ్యంలో నగరం బోసిపోయి కనిపిస్తోంది. దీంతో అనేక మంది గృహ యజమానులు తమ ఇళ్ళ ముందు టూలెట్ బోర్డులు వేలాడతీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అక్టోబరు 31వ తేదీన పెళ్లి చేసుకుంటావా? ప్రియురాలికి సినీ దర్శకుడు ప్రపోజ్ (Video)

'ఎన్నో బాయ్‌ఫ్రెండ్' అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు : శృతిహాసన్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ల కిష్కింధపురి ఫస్ట్ లుక్

Sridevi: ఆరోజునే 3డీలోనూ జగదేక వీరుడు అతిలోక సుందరి రీరిలీజ్

SS Rajamouli: నా ఎక్స్పెక్ట్ కు మించి నాని చాలా ముందుకు వెళ్లిపోయాడు : ఎస్ఎస్ రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments