Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఇప్పటివరకు ఏం పీకారు? గెలిచాక ఏం పీకుతారు?'.. తెరాస ఎమ్మెల్యేలకు ప్రశ్న

తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యేలను 2019 ఎన్నికల్లో ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. వికారాబాద్‌ జిల్లా తాండూరులో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్య

Webdunia
శనివారం, 19 ఆగస్టు 2017 (06:05 IST)
తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యేలను 2019 ఎన్నికల్లో ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. వికారాబాద్‌ జిల్లా తాండూరులో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ‘జయజశంకర్‌ సార్‌ స్ఫూర్తి- ఉద్యమ ఆకాంక్షలు - వాస్తవ పరిస్థితులు’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో కోదండరాం పాల్గొని ప్రసంగించారు.
 
ఇందులో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ... ఓట్ల కోసం వచ్చే ఎమ్మెల్యేలను, ‘ఇప్పటివరకు ఏం పీకారు? గెలిచాక ఏం పీకుతారు?’ అని ప్రశ్నించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అభివృద్ధి కోసం మరో పోరాటం చేయాల్సి ఉంటుందని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తనతో ఆనాడే చెప్పారన్నారు. 
 
ఆయన ఆశయ సాధన కోసమే తాము మరో పోరాటానికి సిద్ధమయ్యామన్నారు. ఇక రాష్ట్రంలో సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు అవకాశం లేకుండా ఆంక్షల పేరిట అడ్డంకులు సృష్టిస్తున్నారని కోదండరాం ఆరోపించారు. రాజ్యాంగం అందరికీ మాట్లాడే హక్కు కల్పించిందని, ఆ హక్కును సాధించుకునేందుకు న్యాయపోరాటం చేస్తామని అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments