Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూకట్‌పల్లిలో పార్క్ చేసినవున్న మూడు బస్సులకు నిప్పు

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (12:58 IST)
హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో పార్కింగ్ చేసివున్న మూడు బస్సులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో ఈ మూడు బస్సులు మంటల్లో పూర్తిగా దగ్ధమైపోయాయి. అయితే, ఈ మూడు బస్సులకు నిప్పు ఎలా అంటుంకుందన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీని వెనుక ఏదేని కుట్ర కోణం ఉండివుంటుందన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.
 
కూకట్‌పల్లి ఐడీఎల్ చెరువు వద్ద పార్క్ చేసివున్న భారతీ ట్రావెల్స్‌కు చెందిన మూడు బస్సులు మంటల్లో కాలిపోయాయి. ఈ ప్రాంతంలో ప్రతి రోజూ భారతీ ట్రావెల్స్‌కు చెందిన బస్సులును పార్కింగ్ చేస్తూ ఉంటారు. అయితే, వాటిలో మూడు బస్సులకు సోమవారం ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ట్రావెల్స్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి. 
 
స్థానిక పోలీసులతో పాటు అగ్నిమాపకదళ శాఖకు కూడా సమాచారం అందించారు. దీంతో పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఫైరింజన్ల సాయంతో అదుపులోకి తెచ్చాయి. అయితే, ఈ బస్సులకు ఉన్నట్టుండి మంటలు చెలరేగడంపై పలు సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రమాదవశాత్తు బస్సులకు మంటలు అంటుకున్నాయా? లేదా ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా అంటించారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments