Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూకట్‌పల్లిలో పార్క్ చేసినవున్న మూడు బస్సులకు నిప్పు

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (12:58 IST)
హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో పార్కింగ్ చేసివున్న మూడు బస్సులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో ఈ మూడు బస్సులు మంటల్లో పూర్తిగా దగ్ధమైపోయాయి. అయితే, ఈ మూడు బస్సులకు నిప్పు ఎలా అంటుంకుందన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీని వెనుక ఏదేని కుట్ర కోణం ఉండివుంటుందన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.
 
కూకట్‌పల్లి ఐడీఎల్ చెరువు వద్ద పార్క్ చేసివున్న భారతీ ట్రావెల్స్‌కు చెందిన మూడు బస్సులు మంటల్లో కాలిపోయాయి. ఈ ప్రాంతంలో ప్రతి రోజూ భారతీ ట్రావెల్స్‌కు చెందిన బస్సులును పార్కింగ్ చేస్తూ ఉంటారు. అయితే, వాటిలో మూడు బస్సులకు సోమవారం ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ట్రావెల్స్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి. 
 
స్థానిక పోలీసులతో పాటు అగ్నిమాపకదళ శాఖకు కూడా సమాచారం అందించారు. దీంతో పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఫైరింజన్ల సాయంతో అదుపులోకి తెచ్చాయి. అయితే, ఈ బస్సులకు ఉన్నట్టుండి మంటలు చెలరేగడంపై పలు సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రమాదవశాత్తు బస్సులకు మంటలు అంటుకున్నాయా? లేదా ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా అంటించారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments