Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూకట్‌పల్లిలో పార్క్ చేసినవున్న మూడు బస్సులకు నిప్పు

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (12:58 IST)
హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో పార్కింగ్ చేసివున్న మూడు బస్సులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో ఈ మూడు బస్సులు మంటల్లో పూర్తిగా దగ్ధమైపోయాయి. అయితే, ఈ మూడు బస్సులకు నిప్పు ఎలా అంటుంకుందన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీని వెనుక ఏదేని కుట్ర కోణం ఉండివుంటుందన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.
 
కూకట్‌పల్లి ఐడీఎల్ చెరువు వద్ద పార్క్ చేసివున్న భారతీ ట్రావెల్స్‌కు చెందిన మూడు బస్సులు మంటల్లో కాలిపోయాయి. ఈ ప్రాంతంలో ప్రతి రోజూ భారతీ ట్రావెల్స్‌కు చెందిన బస్సులును పార్కింగ్ చేస్తూ ఉంటారు. అయితే, వాటిలో మూడు బస్సులకు సోమవారం ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ట్రావెల్స్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి. 
 
స్థానిక పోలీసులతో పాటు అగ్నిమాపకదళ శాఖకు కూడా సమాచారం అందించారు. దీంతో పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఫైరింజన్ల సాయంతో అదుపులోకి తెచ్చాయి. అయితే, ఈ బస్సులకు ఉన్నట్టుండి మంటలు చెలరేగడంపై పలు సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రమాదవశాత్తు బస్సులకు మంటలు అంటుకున్నాయా? లేదా ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా అంటించారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments