Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ తొలి స్పీకర్‌పై అభిమానం ఇలా కూడా ఉంటుందా?

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (22:03 IST)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం లక్ష్మారెడ్డిపల్లి గ్రామంలో ఏడెలి మల్లారెడ్డి అనే ఓ రైతు తెలంగాణ ఉద్యమం నుండి సిరికొండ మధుసూదనాచారి అనుచరుడుగా ఉంటూ టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశాడు.
 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక భూపాలపల్లి నియోజకవర్గం నుండి గెలిచిన సిరికొండ మధుసూదనాచారిని శాసనసభాపతి పదవి కట్టబెట్టారు సీఎం కేసీఆర్. ఆ నియోజకవర్గంలో మధుసూదనాచారి అభిమానులందరూ మదన్న అని పిలుచుకుంటూ ఉంటారు. అయితే మల్లారెడ్డి మాత్రం మదన్న మీద ఉన్న అభిమానంతో తన ఇంట్లో పెంచుకునే కోడిపుంజుకు మదన్న అని పేరు పెట్టు కున్నాడు.
 
మల్లారెడ్డి దగ్గిర సుమారుగా 40 కోళ్లు ఉన్నాయి. సిరికొండ మదన్న వస్తున్నాడు ఓహో.. అని మల్లారెడ్డి పిలవగానే కోళ్లు అన్నీ మల్లారెడ్డి వద్దకు పరిగెత్తుకుంటూ వస్తాయి. చుట్టుపక్కల గ్రామ ప్రజలు అంతా ఈ వింతను చూసి ఇదేం అభిమానం రా బాబూ అనుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

తర్వాతి కథనం
Show comments