రాజీవ్ గాంధీ కృషి వల్లనే 18 ఏళ్లకు ఓటు హక్కు : రేవంత్ రెడ్డి

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (21:50 IST)
మాజీ ప్రధాని, భారత్ రత్న రాజీవ్ గాంధి జయంతి వేడుకలను టీపీసీసీ ఘనంగా నిర్వహించింది. గాంధీ భవన్ లో, సోమజిగూడా, ప్రకాశం హాల్ లో జరిగాయి.
 
సోమజి గుడలో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ కృషి ఫలితంగా యువత రాజకీయాల్లోకి క్రియాశీలకంగా వచ్చిందని 18 ఏళ్లకు యువతకు ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ దని రేవంత్ రెడ్డి అన్నారు.
 
21 ఏళ్లకు ఐ.ఏ.ఎస్ లు, ఐపీఎస్ లు అయ్యి యువత ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నప్పుడు 21 ఏళ్లకే అసెంబ్లీ లో పోటీ చేసే అవకాశం కల్పించాలని అందుకోసం రాజ్యాంగ సవరణ చేయాలని ఈ విషయాన్ని సోనియా గాంధీ గారితో చర్చిస్తామని అన్నారు. 
 
నేడు ప్రపంచంలో ప్రతి పది మంది లో నలుగురు ఐ.టి ఉద్యోగులు ఉండి ప్రపంచంలో అన్ని దేశాలకు ఐ.టి ఉద్యోగులను ఎగుమతి చేసే దేశంగా ఎదిగమంటే అది రాజీవ్ గాంధీ ఘనత అన్నారు. 
 
దేశాన్ని పటిష్టమైన, సమఖ్యమైన దేశంగా నిర్మించడంలో రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారని, దేశ సమగ్రతను కాపాడేందుకు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా  కృషి చేశారని దేశం కోసం ప్రాణాలు అర్పించారని అన్నారు..

సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్, భట్టి విక్రమార్క, మధుయాష్కీ వి. హనుమంతరావు,  బోసురాజు, గీతా రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 
 
అలాగే రాత్రి ప్రకాశం హాల్లో రాజీవ్ గాంధీ మెమోరియల్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బాడీ బిల్డర్లు, వివిధ విభాగాల లో గెలిచిన వారికి రేవంత్ రెడ్డి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ బాలరాజు, అంజన్ కుమార్ యాదవ్, కైలాష్ కుమార్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments