Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 30 లక్షలు దాటిన ప్రయాణికుల సంఖ్య

Webdunia
సోమవారం, 30 నవంబరు 2020 (20:03 IST)
కోవిడ్ నేపథ్యంలో విమానాశ్రయాల పున: ప్రారంభం అనంతరం విమాన ప్రయాణీకుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. విమాన ప్రయాణాలు సురక్షితమన్న నమ్మకం పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకుంటూ, దేశీయ ప్రయాణికుల సంఖ్య నవంబర్ నెలలో 37,000 కు చేరింది.
 
అన్‌లాక్ 5.0 కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయాణీకుల వైద్య పరీక్షలు ఇతర వాటి ఆధారంగా క్వారంటైన్ నిబంధనలను సడలించడంతో భారత విమానయాన రంగం క్రమంగా పుంజుకుంటోందని ప్రస్తుత పరిణామాలు చెబుతున్నాయి.

అనేక రాష్ట్రాలు ఇంకా ప్రయాణికుల ఆరోగ్య ప్రొపైల్,  మెడికల్ రిపోర్టులను అడుగుతున్నా, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న కోవిడ్ టెస్టింగ్ కేంద్రం లాంటి వాటి కారణంగా, ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించగలుగుతున్నారు. 
 
మే 25 నుండి దేశీయ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించిన మొదటి కొన్ని వారాలలో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ప్రతిరోజూ సుమారు 3000 మంది ప్రయాణికులు ప్రయాణించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments