Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ తల్లి తన ముగ్గురు బిడ్డలకు విషమిచ్చింది...

నవమాసాలు మోసి పిల్లలకు జన్మనిచ్చిన ఓ కన్నతల్లి పేగుబంధాన్ని మరిచింది. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తాను విషం సేవించింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుర్జాల్ గ్రామంలో చోటు చేసుకుంది. సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన సుజాతకు గాం

Webdunia
బుధవారం, 6 జూన్ 2018 (19:41 IST)
నవమాసాలు మోసి పిల్లలకు జన్మనిచ్చిన ఓ కన్నతల్లి పేగుబంధాన్ని మరిచింది. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తాను విషం సేవించింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుర్జాల్ గ్రామంలో చోటు చేసుకుంది. సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన సుజాతకు గాంధారి మండలం గుర్జాల్ గ్రామానికి చెందిన పడమటి ఉమేష్‌తో 2009లో వివాహం జరిగింది. వీరికి నందిని, 7 నెలల కవల పిల్లలు ధనుష్, ధరణి ఉన్నారు. 
 
ఇన్నేళ్లు కాపురం సజావుగానే సాగింది. బుధవారం రోజున ఉదయం కుటుంబ సభ్యులు ఉపాధి హామీ పనులకు వెళ్లారు. ఇంట్లో సుజాత తన పిల్లలతో ఉంది. ఏమైందో తెలియదు గానీ పెద్దమ్మాయి నందినికి జ్యూస్ అని చెప్పి పురుగుల మందు తాగించింది. అదే మందును తాను తాగి అభంశుభం తెలియని పసికందులకు కూడా పట్టించింది. దాంతో పిల్లల పరిస్థితి విషమంగా తయారైంది. గమనించిన చుట్టుపక్కల వారు కుటుంబ సభ్యులకు విషయం తెలుపగా వీరిని వెంటనే కామారెడ్డిలోని జయ ఆస్పత్రికి తరలించారు.
 
సుజాతను మాత్రం ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. జయ ఆస్పత్రిలో పిల్లలను పరిశీలించిన వైద్యులు వెంటనే వారిని కామారెడ్డిలోని సిరి చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ పిల్లలను పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని, 48 గంటలు గడిస్తే తప్ప ఏమి చెప్పలేమని వెంటనే వీరిని హైదరాబాదుకు తరలించాలని సూచించగా కుటుంబ సభ్యులు మాత్రం ఎల్లారెడ్డిపేట్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన జరగడానికి గల కారణాలు మాత్రం తెలియాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments