Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను వదిలేసి మేనమామను పెండ్లి చేసుకోవాలని తల్లి ఒత్తిడి

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (22:47 IST)
హైదరాబాద్ నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. సాయినాథపురానికి చెందిన  ఆమె కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుందేమోనని అందరూ భావించారు. అయితే నెరెడ్మెట్ పోలీసులకు అనుమానం వచ్చి విచారణ జరపగా ఒక సూసైడ్ నోట్ లభించడంతో విషయం బయటకు వచ్చింది.
 
మృతిరాలి తల్లి రాములమ్మ అతని మేనమామ పుల్లారావు వేధింపులు తట్టుకోలేకనే ఆత్మహత్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది. పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారం మృతిరాలి భర్తను చంపేసి మేనమామ అయినటువంటి పుల్లారావును వివాహం చేసుకోవాలని నిందితులు ఇద్దరు కలిసి మృతురాలిపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు.
 
భర్తను చంపడానికి పొలాలకు వాడే పురుగులమందును కూడా అందించారు. అమాయకుడైన భర్తను చంపడం ఇష్టం లేక వీరి ఒత్తిడి తట్టుకోలేక చివరకు అదే పురుగుల మందును తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తన ఆత్మహత్యకు తన అమ్మ, మేనమామే కారణమంటూ సూసైడ్ నోట్ వ్రాసి మరీ చనిపోయింది. పోలీసులు నిందితులను ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments