Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదృశ్యమైన బాలిక, బండచెరువులో శవమై తేలింది...

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (19:00 IST)
నేరెడ్‌మెట్ లోని కాకతీయనగర్‌లో గురువారం సాయంత్రం తప్పిపోయిన 12 ఏళ్ల బాలిక కథ విషాదాంతంగా మారింది. నిన్న రాత్రి సైకిల్ పైన బయటకు వెళ్లిన సుమేద ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌తో కలిసి నిన్నరాత్రి నుంచి సహాయక చర్యలు చేపట్టారు.
 
అయితే ఇవాళ బండచెరువులో బాలిక మృతదేహం లభ్యం అయ్యింది. అప్పటివరకు తమ పాప ఎక్కడో ప్రాణాలతో ఉంటుందని తల్లిదండ్రులు అనుకున్నారు కానీ ఇలా మృతదేహాన్ని చూసి కన్నీరు పాలవుతామని ఊహించలేకపోయారు. భారీ వర్షాలు తర్వాత దీన్ దయాల్ నగర్‌లో నాలాలన్నీ నీటిలో మునిగిపోయాయి.
 
బాలిక సైకిల్‌ను నాలా సమీపంలో పోలీసులు గమనించి బాలికను కనిపెట్టే ప్రయత్నం చేశారు. జీహెచ్ఎంసీ రెస్క్యూ టీం అధికారులను అప్రమత్తం చేశారు. సెర్చ్ ఆపరేషన్ తర్వాత అధికారులు బాలిక మృతదేహాన్ని వెలుపలికి తీసారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం బాలిక మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెండితెరపై కళ్యాణ్ బాబు మంచి ట్రీట్ ఇవ్వబోతున్నారు : మెగాస్టార్ చిరంజీవి

Hari Hara Veeramallu: ఈసారి డేట్ మారదు, ఇండస్ట్రీ రికార్డులు మారతాయి : దర్శకుడు జ్యోతికృష్ణ

Mahesh Babu: ఏ మాయ చేసావేలో మహేష్ బాబు నటించివుంటే ఎలా వుంటుంది?

Tamannaah: విజయ్‌తో బ్రేకప్ తర్వాత హ్యాపీగా వున్న తమన్నా.. ఫోటోలు వైరల్

Fish Venkat: ఫిష్​ వెంకట్​ మళ్ళీ అనారోగ్యంతో వెంటిలేటర్ పై చికిత్స !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments