Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరీక్ష హాలులో మహిళ.. ఏడుస్తున్న పాప.. పోలీసులు ఏం చేశారంటే?

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2022 (12:38 IST)
జోగుళాంబ గద్వాల్ జిల్లా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గ్రూప్-1 పరీక్షల కోసం ఆరు నెలల పాపాయితో వచ్చిందో మహిళ. కానీ ఆ మహిళ పరీక్ష రాస్తుండగా.. పాపాయి ఏడవటం మొదలెట్టింది. ఆపై ఏం జరిగిందంటే... పూర్తి వివరాలు.. జోగుళాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని గంజిపెట్ సరస్వతి స్కూల్ కు ఐజ మండలం పులికల్ గ్రామానికి చెందిన లక్ష్మి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రాసేందుకు తన 6 నెలల చిన్నారిని తీసుకొని భర్త దినకర్ తో వచ్చి పరీక్ష రాయడానికి లోపలికి వెళ్లగా గంట తరువాత చిన్నారి ఏడ్వటం మొదలు పెట్టింది. తండ్రి ఎంత లాలించిన ఏడుపు ఆపలేదు. దీంతో తండ్రి ఆందోళనకు గురయ్యాడు. వెంటనే తన భార్య లక్ష్మి నీ బయటకు పిలవండని అక్కడి పోలీస్ సిబ్బందికి తెలిపాడు.
 
అయితే.. ఈ విధంగా మధ్యలో పిలువకూడదని చెప్పడంతో భార్యను పిలవండి వెళ్ళిపోతామని అధికారులతో చెప్పాడు. దీంతో పరీక్ష రాసే మహిళను బయటికి రానీయకుండానే.. ఆమెను డిస్టబ్ చేయకుండా అక్కడి పోలీస్ అధికారులు, సిబ్బంది పాప తండ్రికి నచ్చజెప్పి పోలీస్ కానిస్టేబుల్ రజనీకాంత్ ఆ పాపను తీసుకొని సాగర్ చిల్డ్రన్ హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి ఏడుపు మాన్పించి ఎగ్జామ్ పూర్తి అయ్యేవరకు పాపను లాలిస్తూ అనంతరం పాప తల్లికి అప్పగించాడు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments